మధుమేహం ఎంతోమందిని పీడిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్య. ఈ రోజుల్లో చిన్నా పెద్దా తేడా లేకుండా డయాబెటిస్ వ్యాధికి గురవుతున్నారు. ఒక్కోసారి స్కూలుకు వెళ్లే చిన్నారులు కూడా ఈ వ్యాధికి గురవుతున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. మధుమేహ వ్యాధిని ముందే నిర్మూలించకపోతే అనేక వ్యాధులకు కారణమవుతుంది. మారుతున్న జీవన శైలి, తీసుకునే ఆహారం, ఒత్తిడి, శరీరానికి తగినంత వ్యాయమం లేకపోవడం మధుమేహానికి దారితీస్తుంది. తినే పదార్థాల్లో చక్కెర ఉంటుందని చాలా పదార్థాలు, పండ్లకు దూరంగా ఉంటారు డయాబెటిక్ పేషెంట్లు. అయితే మధుమేహ రోగులు కచ్చితంగా ముల్లంగి తీసుకోవడం అవసరం. చాలామందిలో ప్రస్తుతం మధుమేహం ప్రాణాంతక వ్యాధిలా మారుతుంది.
అయితే ఈ వ్యాధి నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఈ ముల్లంగి దుంపను వినియోగించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ఉండే గుణాలు రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించి మధుమేహం తగ్గించేందుకు సహాయపడుతుంది. ముల్లంగిలో ఉండే పీచు ఆకలిని నియంత్రిస్తుంది. ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను నియంత్రించడంలో సహాయపడుతుంది. మలబద్ధకం, అజీర్ణం, ప్రేగు సంబంధిత ఇన్ఫెక్షన్లు మరియు ఇతర సమస్యలను నివారించడానికి ఉపయోగపడుతుంది. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులలో రక్తపోటు సమస్యలను తగ్గించగలదు. ముల్లంగిలో ఉండే ఫ్లేవనాయిడ్లు ఫ్రీ రాడికల్స్తో పోరాడి శరీరానికి హాని కలగకుండా కాపాడతాయి.
ముల్లంగిలో సహజమైన నైట్రేట్లు ఉన్నాయి, ఇవి శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇందులో ఉన్న విటమిన్లు, జింక్ మొదలైన అనేక పోషకాలు చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. దీనిని రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తొలగిస్తుంది. ఈ కూరగాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుతుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా ఉండేందుకు సహాయపడుతుంది. ముల్లంగిలో విటమిన్ సి ఉంటుంది. ఇది ఒక ముఖ్యమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది శరీరాన్ని సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇందులో ఉన్న తక్కువ కేలరీలు బరువు తగ్గించుకునేందుకు తోడ్పడతాయి.
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…