ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2022లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. గెలుస్తుందనుకున్న సౌతాఫ్రికా జట్టు ఓడిపోయింది. పసికూన నెదర్లాండ్స్ చేతిలో ఓటమి పాలైంది. గెలిస్తే సెమీస్కు వెళ్లే చక్కని అవకాశాన్ని సౌతాఫ్రికా మిస్ చేసుకుంది. ఎప్పటిలాగే ఒత్తిడికి లొంగిపోయింది. ఈ క్రమంలోనే సౌతాఫ్రికాపై నెదర్లాండ్స్ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీని వల్ల పాక్కు సెమీస్ మార్గం మరింత సులభమైంది. ఆ జట్టుకు లక్ కలసి వచ్చినట్లయింది.
మ్యాచ్లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా మొదట ఫీల్డింగ్ తీసుకోగా.. నెదర్లాండ్స్ బ్యాటింగ్ చేపట్టింది. ఈ క్రమంలోనే నెదర్లాండ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాట్స్మెన్లలో కోలిన్ అకర్మన్ 41 పరుగులతో నాటౌట్ నిలవగా, టామ్ కూపర్ 35 పరుగులు చేశాడు. స్టీఫెన్ మైబర్గ్ 37 పరుగులు సాధించాడు. సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహరాజ్ 2 వికెట్లు తీశాడు. అన్రిచ్ నొర్జె, ఎయిడెన్ మార్కరమ్లు చెరో వికెట్ తీశారు.
అనంతరం బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 145 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ జట్టు బ్యాట్స్మెన్లలో ఎవరూ ఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోయారు. ఎప్పటికప్పుడు వికెట్లను కోల్పోతూ వచ్చారు. దీంతో నెదర్లాండ్స్ పెద్దగా కష్టపడకుండానే సునాయాసంగా విజయం సాధించింది. నెదర్లాండ్స్ బౌలర్లలో బ్రాండన్ గ్లోవర్ 3 వికెట్లు తీయగా, బస్ డి లీడి, ఫ్రెడ్ క్లాసెన్లు చెరో 2 వికెట్లు సాధించారు. అలాగే మీకెరెన్కు 1 వికెట్ దక్కింది.
ఈ మ్యాచ్లో గెలిస్తే సౌతాఫ్రికా నేరుగా సెమీస్కు వెళ్లి ఉండేది. మొదటి లేదా రెండో స్థానంలో నిలిచేది. కానీ పసికూన జట్టు చేతిలో ఓటమి కారణంగా సెమీస్ ఆశలు గల్లంతు అయ్యాయి. దీంతో పాకిస్థాన్, బంగ్లాదేశ్లకు అవకాశం దక్కింది. ఈ రెండు జట్లలో గెలుపొందిన జట్టు సెమీస్కు చేరుకుంటుంది. కనుక పాక్, బంగ్లా రెండు జట్లకు చాన్స్ ఉందని చెప్పవచ్చు.
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…