Apricots : ప్రస్తుత తరుణంలో చాలా మంది హైబీపీ సమస్యతో బాధపడుతున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరికీ ఈ సమస్య వస్తోంది. చిన్న వయస్సులోనే చాలా మందికి హైబీపీ వస్తోంది. దీంతో జీవితాంతం మందులను వాడాల్సి వస్తోంది. ఈ క్రమంలో ఒక్కో సందర్భంలో బీపీ నియంత్రణలో ఉండక గుండె జబ్బులు కూడా వస్తున్నాయి. అయితే బీపీ నియంత్రణలో ఉండాలంటే.. డాక్టర్లు రాసిచ్చిన మందులను క్రమం తప్పకుండా వాడాలి. అంతే కాకుండా రోజూ వ్యాయామం చేయాలి. దీంతోపాటు పౌష్టికాహారం తీసుకోవాలి. ఫలితంగా బీపీ తగ్గుతుంది. ఇది పెద్ద సమస్య కానే కాదు.
ఇక బీపీని తగ్గించేందుకు యాప్రికాట్ పండ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇవి మనకు మార్కెట్లో డ్రై ఫ్రూట్స్ రూపంలో లభిస్తుంటాయి. వీటిని రోజుకు 2 తింటే చాలు.. ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా వీటిలో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. చర్మాన్ని, జుట్టును సంరక్షిస్తుంది. అలాగే కిడ్నీలను శుభ్రం చేస్తుంది. దీంతో వ్యాధులు రావు. కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే రక్తనాళాల గోడలు వెడల్పుగా మారుతాయి. దీంతో రక్త సరఫరా సాఫీగా సాగుతుంది. ఫలితంగా బీపీ నియంత్రణలోకి వస్తుంది. కనుక యాప్రికాట్స్ను రోజూ తినాలి.
ఈ పండ్లను తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్లు రాకుండా ఉంటాయి. అలాగే ఈ పండ్లను తింటే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. దీంతో అజీర్ణం తగ్గుతుంది. గ్యాస్, మలబద్దకం వంటివి ఉండవు. ఇలా యాప్రికాట్ పండ్లు మనకు ఎంతగానో మేలు చేస్తాయి. కనుక వీటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాల్సిందే.
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…
గుంటూరు కారంతో చివరిగా పలకరించిన మహేష్ బాబు గత కొద్ది రోజులుగా రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలలో పాల్గొంటూ…