ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 24వ మ్యాచ్లో అద్భుతం చోటు చేసుకుంది. పసికూన జట్టు అయినప్పటికీ.. లక్ష్యం స్వల్పంగానే నిర్దేశించినప్పటికీ.. జింబాబ్వే అద్భుతమైన పోరాట పటిమను ప్రదర్శించింది. పాక్ను మట్టి కరిపించింది. ఆ జట్టుపై కేవలం 1 పరుగు తేడాతో గెలుపొందింది. జింబాబ్వే నిర్దేశించిన 131 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాక్ తడబడింది. వరుసగా వికెట్లను కోల్పోయింది. జింబాబ్వే జట్టు పరిణితి చెందిన టీమ్లాగా సమిష్టిగా ఆడారు. పరుగులు ఇవ్వడంలో పిసినారులుగా వ్యవహరించారు. కట్టుదిట్టమైన బౌలింగ్తో పాక్ను ఆడుకున్నారు. చివరి ఓవర్ చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో ఒత్తిడి లేకుండా జింబాబ్వే అద్భుతంగా ఆడింది. ఈ క్రమంలోనే పాక్ జట్టుకు జింబాబ్వే భారీ షాకిచ్చింది.
మ్యాచ్లో టాస్ గెలిచిన జింబాబ్వే తొలుత బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాట్స్మెన్లలో షాన్ విలియమ్స్ 31 పరుగులు చేయగా.. మిగిలిన వారు ఫర్వాలేదనిపించారు. పాక్ బౌలర్లలో మహమ్మద్ వసీమ్ 4, షాదాబ్ ఖాన్ 3 వికెట్లు తీశారు.
అనంతరం బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు ఆరంభంలో దూకుడుగా ఆడుతున్నట్లు కనిపించినా తరువాత వెంట వెంటనే వికెట్లను కోల్పోయింది. దీంతో చేయాల్సిన పరుగులు పెరిగిపోయాయి. అయితే చివర్లో టెయిలెండెర్లు పోరాటం చేసినా వృథా అయింది. పాక్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాట్స్ మెన్లలో షాన్ మసూద్ (44), మహమ్మద్ నవాజ్ (22) మినహా ఎవరూ రాణించలేదు. ఇక జింబాబ్వే బౌలర్లలో సికందర్ రాజా 3 వికెట్లు పడగొట్టగా బ్రాడ్ ఇవాన్స్కు 2 వికెట్లు దక్కాయి. అలాగే ముజర్బాని, జొంగ్వెలు చెరొక వికెట్ తీశారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…