తెలుగు సినిమా పరిశ్రమకి టైటిల్ కొరత ఎప్పుడూ ఉంటుంది. పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా ఈ టైటిల్స్ విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ఒకప్పుడు అంతగా టైటిల్స్ సమస్య ఉండేది కాదని, ఇప్పుడు చాలా ఎక్కువ అనే చెప్పాలి. సాధారణంగా ఒక సినిమా విడుదలైన తర్వాత, దాదాపు 12 ఏళ్ల పాటు మళ్ళీ ఆ పేరును ఇంకో సినిమాకు వాడకూదడు అని నిర్మాత మండలి షరతు పెట్టింది. కానీ, కొన్నిసార్లు ఈ షరతు వర్తించలేదు. సేమ్ టైటిల్స్ తో రెండు సినిమాలు విడుదలయ్యాయి.
గతంలో స్టార్ హీరో శోభన్ బాబు, యువరత్న నందమూరి బాలకృష్ణ ఒకే టైటిల్ తో సినిమాలు చేశారు. ఇంతకీ ఆ టైటిల్ ఏమిటో తెలుసా? ‘తల్లిదండ్రులు’. 1970 లో మొదట శోభన్ బాబు హీరోగా తల్లిదండ్రులు అనే చిత్రం వచ్చింది. ఈ సినిమాలో శోభన్బాబుకు జోడీగా చంద్రకళ నటించింది. ఈ సినిమాలో శోభన్బాబుకు తల్లిగా మహానటి సావిత్రి, తండ్రిగా జగ్గయ్య నటించారు. ఈ సినిమా అభిమానులను అంతగా అలరించలేదు. బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ గా నిలిచింది. ఇక తల్లిదండ్రులు టైటిల్తో 1991లో బాలయ్య ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
బాలయ్య తల్లిదండ్రులు చిత్రంలో విజయశాంతి హీరోయిన్ గా నటించింది. తాతినేని రామారావు దర్శకుడు. ఉమ్మడి కుటుంబంలో పుట్టిన బాలకృష్ణ పనిపాటా లేకుండా డబ్బు బాగా ఖర్చు చేస్తూ ఉంటాడు. ఇక డ్యాన్స్ టీచర్గా పనిచేసే విజయశాంతికి, బాలయ్యకు అస్సలు పడదు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలతో వీరు ప్రేమలో పడతారు. బాలయ్య కూడా కుటుంబం గురించి తెలుసుకుని మారతాడు. ఇది సినిమా స్టోరీ. ఈ చిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సూపర్ హిట్ అయ్యింది. మొత్తానికి ఒకే టైటిల్తో ఇద్దరు స్టార్ హీరోలు సినిమా చేయగా, ఒకటి మంచి విజయం సాధించింది. రెండోది బోల్తా కొట్టింది.
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…
గుంటూరు కారంతో చివరిగా పలకరించిన మహేష్ బాబు గత కొద్ది రోజులుగా రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలలో పాల్గొంటూ…