పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ చిత్రాలలో ఖుషి చిత్రం ఒకటి. ఈ మూవీ తమిళ చిత్రంకి రీమేక్గా రూపొందగా, ఒరిజినల్ కి దర్శకత్వం వహించిన ఎస్ జె సూర్య తెలుగు వర్షన్ కి కూడా దర్శకత్వం వహించారు. ఏ ఎం రత్నం నిర్మాత. పవన్ కి జంటగా భూమిక కథానాయికగా నటించింది. సమ్మర్ కానుకగా 2001 ఏప్రిల్ 27న విడుదలైంది. ఫస్ట్ షో నుండే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమాలో పవన్ – భూమిక కెమిస్ట్రీ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఇందులో నడుము సీన్ తెగ ఆకర్షించింది. ప్రతి ఒక్కరు కూడా రొమాంటిక్ సీన్కి కనెక్ట్ అయిపోయారు.
పవన్ ఏడవ చిత్రంగా విడుదలైన ఖుషి వసూళ్ల వర్షం కురిపించింది. నిర్మాతలు, బయ్యర్లు ఈ మూవీతో బాగా ఆర్జించారు. ఈ సినిమా తర్వాత పవన్ మార్కెట్ విపరీతంగా పెరిగింది. అయితే ఈ మూవీ టైటిల్ విషయంలో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఖుషి మూవీకి మొదట ‘చెప్పాలనివుంది’ అని అనుకున్నారట. దాదాపు కన్ఫర్మ్ అనుకున్న తర్వాత ఎందుకో క్యాచీగా ఉండాలని భావించిన మేకర్స్ ఆ టైటిల్ని వద్దని ఖుషీ పేరు పెట్టారు. ఇక ఈ టైటిలని వడ్డే నవీన్ వాడుకున్నారు. చంద్ర మహేష్ దర్శకత్వంలో వడ్డే నవీన్, రాశి ప్రధాన పాత్రలుగా చెప్పాలని ఉంది అనే సినిమా తెరకెక్కింది.
ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక్కడ విశేషమేమంటే 2001 ఏప్రిల్ నెలలో ఖుషి విడుదల కాగా… వడ్డే నవీన్ నటించిన చెప్పాలనివుంది అదే ఏడాది ఆగస్టు నెలలో విడుదలైంది. అయితే ఖుషి చిత్రం భారీ హిట్ కాగా, చెప్పాలని ఉంది మాత్రం దారుణంగా నిరాశపరచింది. ఒకవేళ పవన్ ఆ టైటిల్ వాడుకొని ఉంటే సినిమా ఫ్లాప్ అయి ఉండేదా అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…
గుంటూరు కారంతో చివరిగా పలకరించిన మహేష్ బాబు గత కొద్ది రోజులుగా రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలలో పాల్గొంటూ…