YSRCP : గత కొన్నాళ్లుగా ఏపీలో ఎన్నికల వేడి మాములుగా లేదు. కూటమి ఒకవైపు ,వైసీపీ వైపు పోటీ పడుతుండగా, ఈ సారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందా అని ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇటీవల ఎన్నికలు పూర్తి కాగా, రిజల్ట్ ఎవరికి అనుకూలం వస్తుందా అని ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. అయితే పలు సర్వేలు ఫలితాలపై ఆసక్తికర విశ్లేషణలు చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలను సాధిస్తుందని తాజా సర్వే తేల్చింది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 48.5 శాతం ఓట్లు వస్తాయని శ్రీ ఆత్మసాక్షి గ్రూప్ చేసిన సర్వేలో తేలింది, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 46.5 శాతం ఓట్లు పోలవుతాయని చెప్పింది. ఇతరులకు 3 శాతం ఓట్లు పడుతాయని, ఇంత వరకు ఏ నిర్ణయానికి రాని ఓటర్లు 2 శాతం ఉన్నారని ఆ సర్వే స్పష్టం చేసింది. పిఠాపురం విషయానికి వస్తే పవన్ కళ్యాణ్, వంగా గీత మధ్య గట్టి పోటీ ఉంటుందని అంటున్నారు. ఆత్మ సాక్షి సర్వే ప్రకారం పిఠాపురంలో వైసీపీనే లీడ్లో ఉందని అంటున్నారు. కుప్పంలో కూడా వైసీపీ ఐదువేల లీడ్లో ఉంటారని చెబుతున్నారు. మరి ఆత్మసాక్షి సర్వే ప్రకారం ఇందులో ఎంత నిజం ఉంటదనేది తెలియాల్సి ఉంది.
ఇక పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతే ఆయన ప్రజారాజ్యం మాదిరిగా బీజేపీలో విలీనం చేస్తాడట. కుప్పంలో చంద్రబాబు ఓడిపోతే ఆయన కూడా బీజేపీలో విలీనం చేస్తాడని అంటున్నారు.బీజేపీ ఓ శక్తిలా రూపొందుతుంది. రెండు పార్టీలు బీజేపీలో విలీనం అయితే ఆ పార్టీ మరింత బలంగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు. చూడాలి మరి రానున్న రోజులలో సర్వేలు ఏ మేరకు సక్సెస్ అవుతాయి, ఎవరు విజేతలుగా నిలుస్తారు అన్నది తెలియాల్సి ఉంది.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…