YS Sharmila : దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి వర్థంతి సందర్భంగా కుమార్తె, వైఎస్సార్టపీ అధినేత్రి వైఎస్ షర్మిల నివాళులర్పించారు. శనివారం ఉదయం ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్కు చేరుకున్న షర్మిల.. తల్లి విజయమ్మతో కలిసి తండ్రి వైఎస్సార్కు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనల్లో షర్మిల పాల్గొన్నారు. అన్నాచెల్లెళ్లు.. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల మధ్య మరోసారి విభేదాలు బహిర్గతమయ్యాయి. తండ్రి వైఎస్ ఆర్ వర్దంతి కార్యక్రమాల్లో ఎవరికి వారుగా వేరు వేరుగా అన్నాచెల్లెళ్లు హాజరై అందరిని ఆశ్చర్యపరిచారు.
గతంలో వైఎస్ జయంతి సందర్భంగా రిపీటైన సీనే అయినా కూడా ఈసారి అయినా కలుస్తారేమోనన్న ఆశతో వైఎస్ అభిమానులు ఉన్నారు. కాని అది జరగలేదు.మీడియాతో మాట్లాడుతున్న సమయంలో పార్టీ విలీనంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. వైఎస్సార్టీపీ పార్టీ విలీనంపై మాట్లాడేందుకు ఇది వేదిక కాదని తెలిపారు. 14 ఏళ్ళైనా ప్రజల గుండెల్లో వైఎస్ఆర్ ఇంకాబ్రతికే ఉన్నారన్నారు. వైఎస్ అద్భుతమైన పధకాలు ద్వారా కోట్లమంది ప్రజల గుండెల్లో ఉన్నారని తెలిపారు. రైతు పక్షపాతిగా ఉండి విద్యుత్ బకాయిలను మాఫీచేసి, ఉచిత విద్యుత్పై తొలి సంతకం చేసిన మహానేత అంటూ కొనియాడారు. మహిళలకు పావలా వడ్డీ ద్వారా ఎన్నో కుటుంబాలలో వెలుగు నింపారన్నారు.
పేద విద్యార్దులకు ఏ చదువు చదవడానికైనా ఫీజ్ రీఏంబర్స్మెంట్ పెట్టారన్నారు. 108, ఆరోగ్యశ్రీ ద్వారా ఎంతో మంది ప్రాణాలు నిలిపారన్నారు. కుల మతాలకు, పార్టీలకు అతీతంగా పధకాలు అందించారన్నారు. వైఎస్సార్ చనిపోయినప్పుడు ఆ బాధ తట్టుకోలేక 700 మంది గుండె ఆగిందన్నారు. వారి కుటుంబాలకు కూడా ప్రగాఢ సంతాపం తెలియచేస్తూ వైఎస్సార్ బిడ్డగా వారి త్యాగాలు మరిచిపోనని వైఎస్ షర్మిల తెలిపారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…