బద్వేలులో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జగనన్న స్మా ర్ట్ సిటీ కోసం అధికారు లు దళితుల భూములను తీసుకున్నారు. ఇంత వరకూ ఎలాంటి నష్ట పరి హారం, ప్రత్యామ్నాయం చూపకపోగా పనులు ప్రారం భిస్తుండడంతో బాధితులు రోడ్డెక్కారు. జాతీయ రహదారిపై టైర్లు, కంచెలు వేసి బైఠాయించారు.ఎలాంటి ప్రత్యా మ్నాం చూపకుండా పనులు ఎలా మొదలుపెడతారంటూ అధికారులను నిలదీశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని చెదగొట్టే ప్రయ త్నం చేయగా దళితులు, మహిళలు వారిని వారించారు.
తమ భూములు అధికార పార్టీ నాయకులకు కేటాయిస్తే సహించేది లేదని దళితులు తెగేసి చెబుతున్నారు. ఈ క్రమంలో జగనన్న స్మార్ట్ సిటీ భూములను చదును చేసేందుకు అధికారులు పూనుకున్నారు. ముందు జాగ్రత్త చర్యగా గోపవరానికి చెందిన మాజీ కౌన్సిలర్, టీడీపీ నేత వక్కల సుబ్బరాయుడుతోపాటు పలువురిని ఆదివారం అరెస్టు చేసి బి.కోడూరులని అరెస్ట్ చేసి పోలీసుస్టేషన్కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న దళితులు బళ్లారి-కృష్ణపట్నం జాతీయ రహదారిలోని మడకలవారిపల్లెలో రోడ్డుపై బైఠాయించారు. తమ భూములు వేరేవారికి ఇవ్వమని హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని చెప్పారు.
ఈ క్రమంలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో పోలీసులు దళితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో ఓ మహిళ స్పృహ తప్పి పడిపోవడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఓ మహిళ పోలీస్ కాలర్ పట్టుకుంది. పరిస్థితి ఉద్రికత్తంగా మారుతున్న నేపథ్యంలో ఆందోళనకారులతో బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ సుధ ఫోన్లో మాట్లాడారు. సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకువెళతానని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. కాగా, వైఎస్సార్ కడప జిల్లా గోపవరం మండలం మడకలవారిపల్లె వద్ద అన్నమయ్య అర్బన్ డెవల్పమెంట్ అథారిటీ (అడా) ఆధ్వర్యంలో జగనన్న స్మార్ట్సిటీ నిర్మిస్తున్నారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…