ఎన్నికల సమయం దగ్గరపడేకొద్దీ, గన్నవరం రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. లోకేష్ సభ, గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్గా యార్లగడ్డ వెంకట్రావు నియామకంతో కొత్త లెక్కలు తెరమీదకు వస్తున్నాయి. దాంతో వైసీపీ అలర్ట్ అయ్యింది. టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన వల్లభనేని వంశీకి ఎన్నికల్లో గెలుపు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. యార్లగడ్డకు బాధ్యతలు ఇవ్వటం ద్వారా కలిసి వస్తుందని టీడీపీ అంచనా వేయగా, తాజా పరిణమాలతో వైసీపీ కొత్త గేమ్ స్టార్ట్ చేసింది. గన్నవరం నుంచి యార్లగడ్డ వెంకట్రావు టీడీపీలో చేరటంతో, మరో నేత దుట్టా రామచంద్రరావుతో వైసీపీ ఎంపీ బాలశౌరి మంతనాలు జరిపారు. హనుమాన్ జంక్షన్లోని దుట్టా ఇంటికి వెళ్లిన ఆయన.. పార్టీలోనే కొనసాగేలా చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చాయి.
కట్ చేస్తే పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి, జగన్ మోహన్ రెడ్డికి అలాగే వైసీపీకి దూరంగా జరుగుతున్న పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తునాయి. జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు బాలశౌరి, ఇద్దరి మధ్య చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో కూడా వల్లభనేని బాలశౌరి వైసీపీ ఎంపీగా మచిలీపట్నం నుంచి బరిలోకి దిగటం దాదాపు ఖాయమనే పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో గత నాలుగు ఐదు రోజుల నుంచి వల్లభనేని బాలశౌరి వైసీపీ పట్ల కొంత విముఖత వ్యక్తపరుస్తున్నట్లుగా కనిపిస్తుంది.
విశ్వసనీయ వర్గాలనుంచి అందుతున్న సమాచారం ప్రకారం, వల్లభనేని బాలశౌరి వైసీపీని వీడే పరిస్థితి కనిపిస్తుంది, అదే నిజమైతే బాలశౌరి, జనసేన తరుపునుంచి మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తునాయి.ఇది అయితే వైసీపీకి మాత్రం పెద్ద షాక్ గా చెప్పవచ్చు బాలశౌరి వీడటం అనేది చాలా షాక్ అని చెప్పవచ్చు, ఎందుకంటే జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు పార్టీని వీడటం అనేది ఒక కొత్త పరిణామంగా మనం భావించాల్సి ఉంటుంది.
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…