Vaishnav Tej : ఈ సారి ఏపీ ఎన్నికలు మరింత రంజుగా మారే అవకాశం ఉంది. కూటమినా, లేకుంటే వైసీపీనా అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఇదే తరుణంలో పిఠాపురం నుండి పోటీ చేస్తున్న పవన్ కల్యాణ్ని గెలిపించాలని కూడా చాలా మంది భావిస్తున్నారు.తనతో కలిపి 21 అసెంబ్లీ, 2 లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థుల్ని బరిలో దింపిన పవన్.. తన ఫ్యామిలీకి చెందిన వారిని కూడా ప్రచారంలోకి దింపుతున్నారు. పిఠాపురంలో పవన్ కల్యాణ్ ప్రచారం సరిపోదనుకున్నారో ఏమో.. నాగబాబు కూడా అక్కడ చెమటోడుస్తున్నారు.
నాగబాబు సతీమణి కూడా మరిది కోసం పిఠాపురంలో ఇంటింటి ప్రచారం చేపట్టారు. అది చాలదన్నట్టు మెగా ఫ్యామిలీ హీరోలను ఒక్కొక్కరినే రంగంలోకి దింపుతున్నారు. నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ఇప్పటికే పిఠాపురంలో ప్రచారం మొదలు పెట్టారు. ఇప్పుడు మరో హీరో ఆయనకు జత కలిశారు. పవన్ కల్యాణ్ మేనల్లుడు వైష్ణవ్ తేజ్ కూడా పిఠాపురంలో ల్యాండ్ అయ్యారు. ఆయన కూడా ప్రచారాన్ని హోరెత్తించారు. వీరికితోడు జబర్దస్త్ టీమ్ కూడా పిఠాపురంలో హడావిడి చేస్తోంది. పిఠాపురంలో తమ్ముడి తరపున చిరంజీవి ప్రచారానికి వస్తారని అంటున్నా.. అది ఎప్పటినుంచి అనేది మాత్రం క్లారిటీ లేదు. అసలు చిరంజీవి వస్తారా లేదా అనేది ఇంకా ఫైనల్ కాలేదు.
మెగాస్టార్ రావాలని జనసైనికులు బలంగా కోరుకుంటున్నారు. ఆయన వస్తేనే కాపు ఓట్లలో కాస్తయినా కదలిక వస్తుందని అనుకుంటున్నారు. వైష్ణవ్ తేజ్ ఈ రోజు మధ్యా హ్నం 3 గంటలకు పిఠాపురం నవఖండ్రవాడ నుంచి రోడ్ షో ప్రారంభించారు. అనంతరం కొత్తపల్లి మండలం కొండెవరం, ఇసుకపల్లి మీ దుగా నాగులాపల్లి, రమణక్కపేట, రామరాఘవపురం, ముమ్మిడివారిపోడులో పవన్కు మద్దతుగా ప్రచారం చేస్తారన్నారు. అనంతరం శ్రీరాంపురం నుంచి కోనపాపపేట, శీలంవారిపాలెం మీదుగా మూలపేట సెజ్ కాలనీ చేరుకున్నారు.. అక్కడ నుంచి మూలపేట సెంటర్లో రోడ్డుషోలో ప్రసంగించారు. . రామన్నపాలెం, అమీనాబాద్ సెంటర్ నుంచి యండపల్లి ఎస్సీ పేట, యండపల్లి జంక్షన్,కొత్తపల్లి మీదుగా ఉప్పాడ బీచ్రోడ్ సెంటర్లో రోడ్షోలో ప్రచారం నిర్వహించారు.
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…