Roja : మంత్రి రోజాపై తెలుగుదేశం మాజీ మంత్రి బండారు సత్యనారాయణ చేసిన విమర్శలపై ఎంత పెద్ద ఎత్తున రచ్చ జరుగుతుందో మనం చూశాం. చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత బాబు కుటుంబ సభ్యులు, సతీమణి, కోడల బ్రహ్మణిల గురించి రోజా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బండారు శృతి మించారు. రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగతంగా ఆమెను కించపరిచేలా బండారు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ తరపున కేవలం మహిళా కమిషన్ ఛైర్మన్ మాత్రమే అధికారికంగా స్పందించారు.బండారు చేసిన వ్యాఖ్యలపై రోజాకు అనుకూలంగా వైసీపి, బండారుకు మద్దతుగా టీడీపీ సోషల్ మీడియా విభాగాలు నిత్యం దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే రోజాకు మద్దతుగా సినీ నటి ఖుష్బూ రెండు రోజుల క్రితం వీడియో రిలీజ్ చేశారు.
ఖష్బూు తర్వాత మహారాష్ట్ర అమ్రావతి ఎంపీ నవనీత్ కౌర్ కూడా స్పందించారు. రోజా తరపున మాట్లాడారు.టీడీపీ నాయకుడి వ్యాఖ్యల్ని ఖండించారు. ఆ తర్వాత నటి రాధిక శరత్ కుమార్, మీనాలు కూడా వీడియోలు విడుదల చేశారు. ఈ మొత్తం ఎపిసోడ్లో రోజా, బండారు వివాదంలో టీడీపీ నాయకుడికి వ్యతిరేకంగా సినీతారలు ఏకమయ్యారు.అదే సమయంలో వైసీపీలో ముఖ్యమైన మహిళా నాయకురాళ్లు ఎవరు ఇంతకాలం మాట్లాడకపోవడం చర్చనీయాంశంగా మారింది. మంత్రి రోజాకు వైసీపీలో కీలక స్థానం ఉంది. బండారుతో రోజా వివాదం నేపథ్యంలో మహిళా మంత్రులు ఎవరు స్వచ్ఛంధంగా ఖండించకపోవడం ఆ పార్టీలో చర్చకు దారి తీసింది.
ఇక రోజాపై బండారు విమర్శలు తర్వాత ఆమె చాలా రియలైజ్ అన్నట్టు తెలుస్తుంది. గతంలో రోజా.. రేణూ దేశాయ్పై తీవ్ర విమర్శలు చేయగా, ఆ సమయంలో పవన్ కళ్యాణ్ ,రేణూ దేశాయ్ ఎంత బాధపడ్డారనేది ఇప్పుడు తనకు అర్ధమై ఉంటుందని కొందరు అంటున్నారు. అయితే కష్టపడి పైకి వచ్చిన తనపై ఇలాంటి దుర్మార్గపు మాటలు మాట్లాడటంపై దారుణమని రోజా మండిపడ్డారు. ఒక మంత్రిగా ఉన్న తనపైనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సామాన్య మహిళల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. మహిళలపై నీచ వ్యాఖ్యలు చేసే దుర్మార్గులు బయట తిరగకూడదని.. బండారు సత్యనారాయణమూర్తికి తానేంటో చూపిస్తానని రోజా సవాల్ చేశారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…