Ravanasura : మాస్ మహరాజా రవితేజ నటించిన తాజా చిత్రం రావణాసుర. ఇందులో రవితేజ విలన్గా, హీరోగా అదరగొట్టాడు. ఇందులో ఏకంగా ఐదుగరు హీరోయిన్స్ నటించడం విశేషం. అయితే ఈ సినిమాలోని ఓ డైలాగ్ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. రావణాసుర చిత్రంలో రవితేజ క్యారెక్టర్ నెగెటివ్ ఉండడంతో ఇందులో వైలెన్స్, అడల్ట్ కంటెంట్ పాళ్ళు ఎక్కువగానే ఉన్నాయి. రావణాసుర చిత్రానికి సెన్సార్ సభ్యులు ‘ఏ’ సర్టిఫికేట్ ఇచ్చారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు రవితేజ రావణాసుర మూవీలో ఎంత బీభత్సం చేసాడనేంది.
శాంపిల్ గా రావణాసుర మూవీ చిత్రం నుండి రిలీజ్కి ముందే చిన్న డైలాగ్ లీకైంది. మూవీలోని ఓ క్లిప్ వైరల్ గా మారింది. లీక్డ్ వీడియోలో రవితేజ ‘కంచం ముందుకి మంచం మీదకి ఆడపిల్లలు పిలవంగానే రావాలి. లేకపోతే నాకు మండుద్ది రా’ అని ఒక అమ్మాయితో కోపంగా అంటాడు. ఈ డైలాగ్ ఆడవాళ్లను కించ పరిచే విధంగా ఉందని పలువురు అభ్యంతరం చెబుతున్నారు. సెన్సార్ సభ్యులు ఇలాంటి బూతు డైలాగ్ కి ఎందుకు కట్ చెప్పలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. . సదరు డైలాగ్ సినిమా నుండి తొలగించాలని డిమాండ్ కూడా చేస్తున్నారు.
రావణాసుర సినిమా చూసిన సెన్సార్ బోర్డు ఏకంగా 30 కట్స్ చెప్పడం.. దానికి చిత్ర యూనిట్ విభేదించడం.. సెన్సార్ చెప్పిన కట్స్కి ఒప్పుకోకపోవడంతో చివరికి ‘A’ సర్టిఫికేట్ జారీ చేశారనే టాక్ కూడా నడిచింది. సుధీర్ వర్మ రావణాసుర చిత్రాన్ని తెరకెక్కించగా, ఈ మూవీలో దక్ష నాగార్కర్, ఫరియా అబ్దుల్లా, అను ఇమ్మానియేల్, మేఘా ఆకాష్ హీరోయిన్స్ నటిస్తున్నారు. అభిషేక్ నామా, రవితేజ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.. రావణాసుర ఓ బెంగాలీ మూవీ రీమేక్ అని ప్రచారం కాగా.. దర్శకుడు సుధీర్ వర్మ ఖండించారు.
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…