Rashmi Gautam : రష్మి గౌతమ్.. పరిచయం అక్కర్లేని పేరు.. బుల్లితెరకు తనదైన అందాలు అద్దిన గ్లామర్ క్వీన్ రష్మి. ఒకప్పుడు సినిమాల్లో చేసినా కూడా పెద్దగా గుర్తింపు రాలేదు ఈ భామకు.. కానీ జబర్దస్త్ పుణ్యమా అని దెబ్బకు జాతకమే మారిపోయింది. అక్కడ్నుంచి తగ్గేదే లే అంటూ హద్దులు మీరి గ్లామర్ షో చేస్తుంది రష్మి. ఏదైనా మితంగా తింటే ఆహారం.. అతిగా తింటే విషం.. అందాల ఆరబోతలోనూ అంతే. అంతంత మాత్రంగా చూపిస్తేనే ఆవురావురమంటూ చూస్తారు. అలా కాదని మొత్తం చూపించేస్తే చూడ్డానికి ఇంకేం ఉండదు.. అసహ్యం తప్ప.
ఇప్పుడు రష్మిని చూస్తే ఇదే అనిపిస్తుంది. అప్పట్లో గుంటూర్ టాకీస్ కోసం సెగలు పుట్టించింది ఈ భామ. అవి చల్లారక ముందే రెచ్చిపోతూనే ఉంది రష్మి. అస్సలు తగ్గేదే లేదన్నట్లు అంతం, రాణి గారి బంగళా.. ఇలా ఏ సినిమా పడితే అందులో అందాలన్నీ ఆరబోసింది. కెమెరాకు తన అందాలన్నీ బేరం పెట్టేసింది ఈ జబర్దస్త్ భామ. ఇండస్ట్రీకి వచ్చి ఇన్నాళ్ళైనా ఇంకా ఎవ్వరూ తనను పట్టించుకోవట్లేదనే కసో.. లేదంటే వచ్చిన అవకాశాన్ని ఎలాగైనా ఒడిసి పట్టుకోవాలనో తెగింపో తెలియదు గానీ వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటుంది రష్మి. ఓ సారి హద్దు దాటిన తర్వాత మళ్లీ దాటితే ఏంటి అనుకుందో ఏమో.. ప్రతీసారి అదే చేస్తుంది.
అప్పట్లో ఫస్ట్ టైమ్ కాబట్టి గుంటూర్ టాకీస్కు ప్రేక్షకులు బాగానే కనెక్ట్ అయ్యారు. కానీ ప్రతీసారి అవే అందాలంటే ఎవ్వరికైనా వెగటు పుడుతుంది. ఇదే ఇప్పుడు రష్మి పాలిట శాపంగా మారుతోంది. అంతం, రాణి గారి బంగళా సినిమాలు ఎప్పుడొచ్చాయో.. ఎప్పుడెళ్లాయో కూడా క్లారిటీ లేదు. రష్మిని చూపించి బిజినెస్ చేసుకుందామని కలలు కన్న దర్శక నిర్మాతలకు ఊహించని షాక్ తగులుతుంది. కనీసం పోస్టర్ ఖర్చులు కూడా వచ్చేలా కనిపించట్లేదు. ఇదంతా ఆమె ప్రొఫెషనల్.. కానీ పర్సనల్గా మాత్రం రష్మి చాలా ఎమోషనల్.. పైగా సాఫ్ట్. నాన్ వెజ్ తినదు.. కనీసం పాలు కూడా తాగదు. ఎందుకో తెలుసా.. ఆ పాలు కావాలన్నా కూడా మూగ జీవాలను హింసించాల్సి వస్తుందని ఆమె భావన.
అక్కినేని అమల మాదిరే రష్మి కూడా జంతు ప్రేమికురాలు. వాటికి ఏ చిన్న ప్రాబ్లమ్ వచ్చినా ఈమె కంట నీరు వచ్చేస్తుంది. ఆ మధ్య కరోనా అప్పుడు కూడా అంతా మనుషులకు సాయం చేస్తే ఈమె మాత్రం కుక్కలు, పిల్లులకు సాయం చేసింది. ఇప్పుడు కూడా జంతువుల గురించి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. మనం మనుషులుగానే పుట్టాం కదా.. అందుకే నోరు లేని జంతువులకు హెల్ప్ చేయకపోయినా ఫర్లేదు కానీ వాటిని హింసించొద్దు.. ప్రతి మనిషికి మూగజీవాలకి హెల్ప్ చేసేంత స్థోమత ఉండకపోవచ్చు.. కానీ హింసించకుండా ఉండే మనసు మాత్రం ఉంటుంది. ప్లీజ్ దయచేసి మీరు మూగజీవాలకు హెల్ప్ చేయకపోయినా ఫర్లేదు కానీ హింసించకండి అని రాసుకొచ్చింది రష్మి. ఈ పోస్ట్ బాగానే వైరల్ అవ్వడం కాదు.. అందరినీ ఆలోచింపజేస్తుంది కూడా.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…