Jayaprada : శ్రీదేవి, జయప్రద ఇద్దరూ టాప్ స్టార్ హీరోయిన్స్. తెలుగులో ఇద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించి స్టార్ డమ్ సంపాదించారు. శ్రీదేవి, జయప్రద ఇద్దరూ ఒకేసారి బాలీవుడ్ కి వెళ్లారు. బాలీవుడ్ లో శ్రీదేవి సూపర్ స్టార్ అవ్వగా, జయప్రద బాలీవుడ్ లో కొంతకాలం మాత్రమే టాప్ హీరోయిన్ గా ఉంది. ఇద్దరు కలిసి ఎన్ని సినిమాల్లో నటించినా ఇద్దరికీ అసలు పడేది కాదు. తెర మీద చాలా అన్యోన్యంగా కలిసి నటించే ఇద్దరు హీరోయిన్స్ అసలు మాట్లాడుకునేవారు కాదంటే ఆశ్చర్యం కలుగుతుంది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్ళితే..
30 సంవత్సరాల క్రితం శ్రీదేవి తెలుగు, తమిళంలో అప్పుడే పేరు తెచ్చుకుంటున్న నటి. శ్రీదేవికి బాగా కలిసివచ్చిన సినిమాను హిందీలో కూడా తీశారు. ఆ సినిమాలో అమూల్ పాలేకర్ తెలుగులో చంద్రమోహన్ చేసిన పాత్రను చేశాడు. ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఆ తర్వాత జయప్రద హిందీలో సర్గమ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తెలుగులో జయప్రద నటించిన సిరిసిరిమువ్వ సినిమా రీమేక్. తెలుగులో హిట్ అయిన ఈ సినిమా హిందీలో ఫర్వాలేదని అనిపించింది. ఈ సినిమాలో రిషి కపూర్ హీరోగా నటించాడు.
ఈ పరిస్థితిలో శ్రీదేవి కన్నా జయప్రదదే పైచేయి అయింది. ఆ తర్వాత శ్రీదేవి హిమ్మత్ వాలా, మవాలి, జస్టిస్ చౌదరి మూడు సినిమాల్లో నటించింది. ఈ మూడు సినిమాలు కృష్ణ సంస్థ పద్మాలయ స్టూడియో నిర్మించింది. ఈ మూడు సినిమాలు సూపర్ హిట్ అవ్వటంతో శ్రీదేవి ఆల్ ఇండియా స్టార్ అయిపోయింది. ఇదే సమయంలో జయప్రద రేసులో వెనకపడిపోయింది. దాంతో జయప్రద నేను పుట్టుకతోనే అందంగా పుట్టాను. శ్రీదేవి ప్లాస్టిక్ సర్జరీతో అందం తెచ్చుకుంది. ఆమెతో నాకేమిటి పోలిక అంటూ మాట్లాడింది.
ఆ మాటలు అలా అలా శ్రీదేవికి చేరటంతో వీరిద్దరూ కలిసి ఏ సినిమాలో నటించినా వీరి మధ్య కోల్డ్ వార్ నడిచేది. వీరిద్దరిని కలపాలని చాలా మంది ట్రై చేసినా వర్క్ అవుట్ కాలేదు. బాలీవుడ్ నటుడు జితేంద్ర వీరిద్దరినీ మేకప్ రూమ్ లో ఉంచి బయట గడియ పెట్టారు. కొంచెం సేపు అయ్యాక చూస్తే ఎవరికి వారే గోళ్లు గిల్లుకుంటూ ఉన్నారే కానీ ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదట. ఎన్ని విభేదాలు ఉన్నా తెరపై మాత్రం ఇద్దరూ చాలా సన్నిహితంగా, అక్కచెల్లెళ్లుగా నటించటం గొప్పే మరి. వీరిద్దరి మధ్య వైరాన్ని జయప్రద చెల్లి కొడుకు పెళ్లి తీర్చింది. వీరి మధ్య ఇంత నిశబ్దం ఉన్నా ఈ 25 సంవత్సరాల కాలంలో ఒకరి గురించి మరొకరు నోరు జారిన సందర్భాలు కూడా అసలు లేవు. అందుకే వారు సూపర్ స్టార్స్ అయ్యారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…