తెలుగులో స్టార్ హీరోల అందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది రకుల్ ప్రీత్ సింగ్. అయితే ఈ మధ్య టాలీవుడ్ అంతగా కలిసి రాకపోవడంతో బాలీవుడ్ చెక్కేసింది. బాలీవుడ్ లో తన హవా కొనసాగిస్తోంది. ఒకప్పుడు టాలీవుడ్ లో తన అందచందాలతో గ్లామర్ షో చేసి ఆకట్టుకున్న ఈ భామ హిందీలో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారింది. కానీ ఆ సినిమాలు అనుకున్నంత సక్సెస్ కాకపోయినా అవకాశాలు మాత్రం తగ్గేదే లే అంటున్నాయి. విభిన్నమైన పాత్రలు పోషిస్తూ తన గ్లామర్ తో నార్త్ ప్రేక్షకులను తెగ ఎంటర్టైన్ చేస్తోంది.
2022 లో జాన్ అబ్రహం సరసన ఎటాక్ అనే సినిమా చేసింది. అలానే అజయ్ దేవగన్ రన్వే 34, అక్షయ్ కుమార్ కట్పుట్లి (ఓటీటీలో విడుదల), ఆయుష్మాన్ ఖురానా డాక్టర్ జి మరియు అజయ్ దేవగన్ థాంక్స్ గాడ్ వంటి చిత్రాలలో నటించింది. ఇవి బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ కాగా, రకుల్కి ప్రత్యేక క్రేజ్ కూడా తెచ్చిపెట్టలేకపోయాయి. సాధారణంగా వరుస ఫ్లాపులు వస్తే ఇక అవకాశాలు రావడం చాలా కష్టం. కాని ప్రస్తుతం రకుల్ చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయంటే ఆమె క్రేజ్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు.
రకుల్ చేతిలో హిందీ చిత్రాలు చత్రివాలి, మేరే పట్నీ కి రీమేక్, శివకార్తికేయన్ అయాలాన్, కమల్ హాసన్ భారతీయుడు 2 మరియు మరొక ద్విభాషా చిత్రంతో సహా మరో ఐదు చిత్రాలు విడుదలకి సిద్ధంఆ ఉన్నాయి.స్టార్స్తో ఉన్న రిలేషన్ కారణంగా ఆమెకి ఇన్ని ఆఫర్స్ వస్తున్నాయంటున్నారు. అయితే ఒక్క హిట్ అయిన రకుల్కి పడితే మళ్లీ ఈ అమ్మడి క్రేజ్ ఊపందుకోవడం ఖాయం. కాగా, రకుల్ ప్రీత్ సింగ్ చివరిగా తెలుగులో కొండపొలం మూవీలో నటించింది. ఈ సినిమాలో పంజా వైష్ణవ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ జోడి కట్టింది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వచ్చిన ఈ కొండపొలం బాక్సాఫీస్ వద్ద అంత సక్సెస్ కాలేదు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…