Rajamouli : తెలుగు సినిమా ఖ్యాతిని దశదిశలా వ్యాపించేలా చేసిన దర్శకుడు రాజమౌళి. ఆయన ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాతో మంచి హిట్ సాధించాడు. ప్రస్తుతం మహేష్తో భారీ బడ్జెట్ చిత్రం చేసే ఆలోచనలో ఉన్నాడు.మరోవైపు ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ప్రమోషన్లలో బిజీగా ఉన్న నేపథ్యంలో బ్లాక్ బస్టర్ హిట్ కాంతార సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. భారీ హిట్ అందుకోవాలంటే సినిమాలు భారీ స్థాయిలో తెరకెక్కించాల్సిన అవసరం లేదని.. కాంతార లాంటి చిన్న సినిమాలు కూడా పెద్ద విజయాన్ని అందుకుంటాయని అన్నారు. దీనికి ఉదాహరణే 16 కోట్లతో తీసిన సినిమా 400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది అని తెలిపాడు.
ప్రేక్షకుల్లో ఎంత ఆతృత ఉన్నా..మనమేం చేస్తున్నామనేది పరిశీలించుకోవాలని రాజమౌళి తెలిపారు. సెప్టెంబర్ నెలలో విడుదలైన కాంతారా సినిమా..మణిరత్నం సినిమా పొన్నియన్ సెల్వన్ను పక్కనపడేసింది. ఈ సినిమా కేవలం మౌత్ పబ్లిసిటీ ద్వారా చాలా ప్రాచుర్యం పొందింది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి భారీ బడ్జెట్ సినిమాలు తీసిన రాజమౌళి..కాంతారా సినిమా విజయం సాధించడంతో ఇలా మాట్లాడటం సంచలనంగా మారింది. కంటెంట్ ముఖ్యం.. ప్రచారం కాదు. సినిమా అనేది ప్రేక్షకులకు ఉత్సాహాన్ని కలిగించాలి. ఈ విషయాన్ని చిత్రనిర్మాతలుగా.. దర్శకులుగా మనం ఎలా సినిమాను రూపొందిస్తున్నామనేది నిత్యం తనిఖీ చేయాలి” అని అన్నారు రాజమౌళి.
కన్నడ పాన్ ఇండియా సినిమా కాంతారాపై ప్రముఖ దర్శకుడు రాజమౌళి కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. 16 కోట్ల బడ్జెట్తో రూపొందిన కాంతార సినిమా మన సంస్కృతి, సంప్రదాయాలను ఎలివేట్ చేస్తూనే చక్కటి కథ, పెర్ఫామెన్స్తో ఆడియెన్స్ను ఎంతగానో అలరించింది. పాన్ ఇండియా రేంజ్లో కన్నడ మినహా మిగిలిన అన్నీ భాషల్లో అనువాదమై ఏకంగా రూ.400 కోట్ల మేరకు వసూళ్లను సాధించి బాక్సాఫీస్ దగ్గర సరికొత్త వసూళ్ల సునామీని సృష్టించడంతో ఈ సినిమాపై అందరి దృష్టి పడింది. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ కాంతార సినిమాను తెరకెక్కించారు. హోంబలే ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మించింది.
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…
గుంటూరు కారంతో చివరిగా పలకరించిన మహేష్ బాబు గత కొద్ది రోజులుగా రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలలో పాల్గొంటూ…