నేటి తరం యువకుల తొందరపాటు పని వారి ప్రాణాల మీదకు తెస్తుంది. ఎంతో మంచి జీవితం ఉండగా, ప్రేమ, దోమ పేరుతో నాశనం చేసుకుంటున్నారు. ప్రేమ పేరుతో దగ్గరైన ఆ బంధం పలు కారణాల వలన మధ్యలోనే ముగిసిపోతుంది. వారి ప్రమేయం లేకుండానే విధి ఆడే వింత నాటకంలో ప్రాణాలను కోల్పొతున్నారు. ఆ విధంగానే ఒక యువకుడు ప్రియురాలికి పిజ్జా ఇవ్వడానికి వెళ్లి బిల్లింగ్ నాల్గోవ అంతస్తు పైనుంచి పడి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హైదరాబాద్లోని బోరబండకు చెందిన 19 ఏళ్ల మహమ్మద్ షోయబ్ అనే యువకుడు తనుండే ప్రాంతంలోని ఓ బేకరీలో పని చేస్తున్నాడు.అయితే అతడికి అదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో కొద్ది నెలల క్రితం పరిచయం ఏర్పడింది.
ఇద్దరి మధ్య ఏర్పడ్డ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఈ నేపథ్యంలోనే ఆదివారం రాత్రి అతడు తన ప్రియురాలి ఇంటికి పిజ్జా తీసుకుని వెళ్లాడు. షోయబ్ ఇంట్లో ఉన్న సమయంలో యువతి తండ్రి వచ్చాడు. డోర్ కొట్టింది తన ప్రియురాలి తండ్రి అని తెలియగానే షోయబ్కు ఏం చేయాలో పాలుపోలేదు. తాను ఇంట్లో ఉన్న సంగతి అతడికి తెలిస్తే పెద్ద గొడవ జరుగుతుందని అతడు భావించిన అతను విచక్షణ కోల్పోయి నాలుగో అంతస్తు పైనుంచి కిందకు దూకాడు. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. రక్తం మడుగులో పడిఉన్న అతడ్ని స్థానికులు దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు.
పోలీసులకు సైతం ఇందుకు సంబంధించిన సమాచారాన్ని అందించారు. షోయబ్ పరిస్థితి విషమంగా ఉండటంతో ఉస్మానియాకు తీసుకెళ్లారు. ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతడు సోమవారం ఉదయం కన్నుమూశాడు. షోయబ్ మరణంపై అతడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సాధారణంగా 17 నుండి 23 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవారే ఇలాంటి తప్పుడు నిర్ణయాలతో బలి అవుతున్నారు. చిన్న వయస్సులో షోయబ్ మృతి చెందడం చాలా మందిని బాధించింది.
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…
గుంటూరు కారంతో చివరిగా పలకరించిన మహేష్ బాబు గత కొద్ది రోజులుగా రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలలో పాల్గొంటూ…