Pilli Subhash Chandra Bose : ప్రస్తుతం ఏపీ రాజకీయాలపై అందరి దృష్టి పడింది. ఒకవైపు వైసీపీపై జనసేన, టీడీపీ తీవ్రమైన ఆరోపణలు చేస్తుండగా, మరోవైపు కోనసీమ జిల్లా రామచంద్రాపురం వైఎస్ఆర్ సీపీలో అంతర్గత విభేదాలు తారా స్థాయికి చేరడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ప్రస్తుతం అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలక్రిష్ణకు, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్కు మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలక్రిష్ణకు మళ్లీ టికెట్ ఇస్తే తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు.
అవసరమైతే వైఎస్ఆర్ సీపీ నుంచి వైదొలిగి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. కార్యకర్తలు, క్యాడర్ దగ్గర చెల్లుబోయిన వేణు ఎన్ని రోజులు నటిస్తారని ప్రశ్నించారు. తమను వేణు చెప్పు కింద బతికే వాళ్లం అనుకుంటున్నారా? అని పిల్లి అన్నారు. వైఎస్ఆర్ సీపీ ఆవిర్భావం నుంచి తాము సీఎం జగన్తోనే ఉన్నామని , ఇద్దర్నీ పిలిచి సమావేశపరుస్తానని సీఎం జగన్ చెప్పారని అన్నారు. అసలు క్యారెక్టర్ లేని వ్యక్తితో తాను కూర్చోనని చెప్పేశానని పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. ఈ విషయంలో ఇబ్బంది పెట్టొద్దని జగన్కు చెప్పానని అన్నారు.
తన క్యాడర్ను మంత్రి వేణు ఇబ్బందులకు గురిచేశారన్నారు. సమయం వచ్చినప్పుడు క్యాడర్ కచ్చితంగా సమాధానం చెప్తారన్నారు. క్యాడర్ను వదులుకోవడానికి సిద్ధంగా లేనని.. పార్టీ అధిష్టానానికి అన్ని విషయాలు తాను చెప్పుకొచ్చానంటూ పిల్లి సుభాష్ స్పష్టం చేశారు. అయితే పిల్లి సుభాష్ వ్యాఖ్యలపై మంత్రి వేణు స్పందించారు. మండలి రద్దు అవ్వదని తెలిసి బోస్ను… మంత్రిగా కంటిన్యూ అవుతావా అని జగన్ అడిగారన్నారు. అనుచరుల వల్లే బోస్కి అపకీర్తి, మచ్చ వస్తుందన్నారు. పార్టీకి నష్టం చేసే వారిని కచ్చితంగా దూరం పెడతానన్నారు మంత్రి వేణు. తల్లి లాంటి పార్టీని కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందని.. ఓడిపోయినా బోస్ను వదలలేదన్నారు. ఎమ్మెల్సీ ఇచ్చాడు, మంత్రి, రాజ్యసభ ఇచ్చాడని గుర్తు చేశాడు మంత్రి వేణు.
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…