Naresh : గతంలో పలు వివాదాల ద్వారా నరేష్- పవిత్ర జోడీ వార్తల్లో నిలిచింది. నరేష్ పవిత్ర కాంబినేషన్లో మళ్లీ పెళ్లి అనే మూవీతోఈ జంట ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. నరేష్ పవిత్ర లోకేష్ తో సహజీవనం చేస్తున్నాడని 2022లో బయటపడింది. కానీ గత నాలుగేళ్లుగా వీరు కలిసే ఉంటున్నారు. కేవలం సన్నిహిత వర్గాలకు మాత్రమే ఈ విషయం తెలుసు. పవిత్ర లోకేష్ని నరేష్ పెళ్లి చేసుకోలేదు. అయితే ఆమె భార్యకు ఏమాత్రం తక్కువ కాదు. చెప్పాలంటే అంతకంటే ఎక్కువే అంటారు. రీసెంట్గా తాను పవిత్రని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పి షాకిచ్చాడు. చాలామంది ఇష్టం లేకపోయినా కేవలం సమాజం కోసం పెళ్లి అనే బంధంలో ఉంటున్నారు. అలాంటి వాళ్ల కోసమే ఈ సినిమా.
పెళ్లి అంటే తాళిబొట్టు, మెట్టెలు కాదు. అవి కేవలం సంకేతాలు మాత్రమే. పెళ్లి అంటే రెండు హృదయాలు కలవడం. నాకు పవిత్రకు ఇంకా పెళ్లి కాలేదు. కానీ మా మనసులు కలిశాయి. అందుకే మేము కలిసి హ్యాపీగా ఉంటున్నాం. త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటాం. దానికి మీ ఆశీస్సులు కావాలి అని చెప్పుకొచ్చాడు. అయితే లో నరేష్ కృష్ణ ఫ్యామిలీ పరువు తీస్తున్నారనే ఒక వాదన వినిపించింది. పెళ్లి చేసుకోకుండా నరేష్, పవిత్రలు కలిసి జీవించడాన్ని మహేష్, కృష్ణ ఎలా చూశారనే విషయాన్ని నరేష్ బయటపెట్టారు. ఆయన ప్రకారం వారు అంగీకరించారట. మహేష్, కృష్ణ, అమ్మ విజయనిర్మల మేమంతా ఒక కుటుంబం. ఒక మాట మీద ఉంటాం. మా కుటుంబం పవిత్ర లోకేష్ ని ఒప్పుకున్నారు, అని నరేష్ అన్నారు.
పవిత్ర లోకేష్ వంటలను కృష్ణ చాలా ఇష్టంగా తినేవారు అని నరేష్ చెప్పుకొచ్చాడు. మా మొత్తం కుటుంబానికి పవిత్ర ఫుడ్ ప్రిపేర్ చేయగలదు. అందరూ పవిత్రను అంగీకరించినందుకు నేను చాలా హ్యాపీ అని నరేష్ అన్నారు. గత ఏడాది కృష్ణ మరణించిన నేపథ్యంలో పవిత్ర-నరేష్ అన్నీ తానై వ్యవహరించారు. భౌతిక కాయం వద్ద ఏర్పాట్లు చూసుకున్నారు. కాగా, నరేష్ కి మూడో భార్య రమ్య రఘుపతితో విడాకులు కాలేదు. కాబట్టి మరో వివాహం చేసుకోవడానికి వీలులేదు. అయితే ఇటీవల సుప్రీం కోర్ట్ వెలువరించిన తీర్పు తనకు అనుకూలమని నరేష్ చెప్పడం కొసమెరుపు. అంటే తనకు ఇష్టం వచ్చిన వాళ్ళను వివాహం చేసుకునే హక్కు తనకుందని నరేష్ పరోక్షంగా చెప్పకనే చెప్పారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…