Nadendla Manohar : జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇంటికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వెళ్లారు. ఎప్పుడో పదేళ్ల కిందట ఆయన ఇలా వెళ్లారు. మళ్లీ ఇప్పుడు వెళ్లారు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్లి పరామర్శించారు కదా.. ఇప్పుడు అదే గౌరవాన్ని నిలబెట్టుకుంటూ, చంద్రబాబు కూడా హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు. ఐతే.. వీరు ఏం చర్చించారన్నది ఇప్పుడు మెయిన్ టాపిక్ అయ్యింది. ఇద్దరు నేతలు సుమారు రెండున్నర గంటల పాటు పలు కీలక అంశాలపై చర్చించారు.. మరో ఒకటి రెండు సమావేశాలు జరగనున్నాయి. సంక్రాంతి నాటికి సీట్ల పంపకాలపై క్లారిటీ వస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఉమ్మడి మేనిఫెస్టో పైనా ఇద్దరు నేతలూ చర్చించారు. ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేయాలి? ఎక్కడ నుంచి బరిలో దిగాలనే అంశంపై నేతలు చర్చించారు. ఉమ్మడి మేనిఫెస్టోలో ఏయే అంశాలు పెట్టాలి? దాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం తదితర అంశాలపైనా ఇద్దరి మధ్య చర్చ జరిగింది. ఉమ్మడిగా బహిరంగ సభల నిర్వహణ, ఎక్కడెక్కడ సభలు నిర్వహించాలి, ఎవరెవరు హాజరవ్వాలి? వాటిని ఎప్పట్నుంచి ప్రారంభించాలనే అంశాలపైనా ఇద్దరు నేతలూ చర్చించినట్టు సమాచారం.. ఇద్దరూ కలిసి బహిరంగ వేదికపైకి వచ్చి కీలక నిర్ణయాలను వెల్లడించనున్నారు.. అదే వేదికపై నుంచి ఉమ్మడి మేనిఫెస్టోను కూడా ప్రకటించే అవకాశం ఉంది.
ఇక ఈ భేటీపై జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మీడియాకు వివరాలు తెలిపారు. పవన్ కల్యాణ్, చంద్రబాబు వివిధ అంశాలపై రెండున్నర గంటల పాటు చర్చించారని వెల్లడించారు. రాష్ట్ర ప్రజలకు మంచి భవిష్యత్తు అందించే దిశగా చర్చలు సాగాయని తెలిపారు. వైసీపీ విముక్త ఏపీ కోసం ఎలా కలిసి పనిచేయాలో చర్చించినట్టు నాదెండ్ల వివరించారు. ఎన్నికలకు ఎలా వెళ్లాలనే వ్యూహంపై చంద్రబాబు, పవన్ చర్చించారు. ఏపీకి చక్కటి పరిపాలన ఎలా అందించాలనే దానిపై చర్చ జరిగింది. పార్టీ పరంగా, సంస్థాగతంగా తీసుకున్న నిర్ణయాలు కూడా ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చాయి. భవిష్యత్తులోనూ రెండు పార్టీల శ్రేణులు ఐక్యంగా ముందుకు వెళతాయి. మిగతా విషయాలు త్వరలో వెల్లడిస్తాం” అని నాదెండ్ల పేర్కొన్నారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…