MLC Kavitha : ప్రస్తుతం ఎన్నికల హడావిడి నడుస్తుంది. ఎక్కడ చూసిన ఆయా పార్టీలు ప్రచారాలలో బిజీగా ఉన్నారు. పలువురు నామినేషన్ వేస్తున్నారు. అయితే తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్కూటీపై ప్రయాణించారు. సామాన్యురాలిగా ఆమె స్కూటీపై వెళ్తుండటం చూసిన స్థానికులు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఒక్కసారిగా ఆమెకు అభివాదం చేసేందుకు పోటీపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నిజామాబాద్ జిల్లా బోధన్ అసెంబ్లీ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే షకీల్ బోధన్ ఆర్వో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. బోధన్ అసెంబ్లీ బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్ నామినేషన్ ప్రక్రియకు ఆ పార్టీ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బైక్ పైన వెళ్లారు.
ట్రాఫిక్ జామ్ కావడంతో ఆమె ద్విచక్రవాహనంపై నామినేషన్ ప్రక్రియ కోసం వెళ్లవలసి వచ్చింది. కవిత బైక్పై వెళ్తుండగా సెక్యూరిటీ సిబ్బంది, కార్యకర్తలు వెంట పరుగు పెట్టారు. షకీల్ నామినేషన్ ప్రక్రియలో కవిత వెంట ఉన్నారు. కాగా, షకీల్ నామినేషన్ సందర్భంగా బోధన్ పట్టణంలో బీఆర్ఎస్ ప్రచార వాహనంలో ర్యాలీ తీశారు. ఈ ర్యాలీలో కవిత పాల్గొన్నారు. షకీల్ నామినేషన్ దాఖలు చేసిన అనంతరం కవిత మాట్లాడుతూ… దేశమంతా గులాబీ హవా నడుస్తోందన్నారు. షకీల్ను ఇక్కడి నుంచి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. షకీల్ నామినేషన్ ర్యాలీని చూస్తుంటే విజయోత్సవ ర్యాలీలా కనిపిస్తోందన్నారు. ఈ జోష్ షకీల్ విజయం ఖాయమని చెబుతోందన్నారు.
అయితే నామినేషన్ దాఖలుకు ముందు ర్యాలీగా వెళ్లేందుకు సిద్ధమయ్యారు కవిత. ఈ ర్యాలీకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హాజరు కావాల్సి ఉంది. ఆమె వెళ్తున్న దారిలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో ఆమె వాహనం ట్రాఫిక్ లో చిక్కుకుంది. దీంతో ఎమ్మెల్సీ కవిత ర్యాలీ ప్రారంభ స్థలికి చేరుకొనేందుకు స్కూటీపై ప్రయాణించారు. ఓ వ్యక్తి స్కూటీని నడుపుతుండగా కవిత వెనుకాల కూర్చొని ప్రయాణించారు.ఈ సన్నివేశాలని ప్రతి ఒక్కరు తమ కెమెరాలలో బంధించారు.
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…
గుంటూరు కారంతో చివరిగా పలకరించిన మహేష్ బాబు గత కొద్ది రోజులుగా రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలలో పాల్గొంటూ…