MLA Alla Ramakrishna Reddy : ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌రువును ఆళ్ల రామ‌కృష్ణా రెడ్డి అలా తీసేశారేంటి..?

MLA Alla Ramakrishna Reddy : జ‌న‌సేనాని అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇటీవ‌ల ఏపీ రాజ‌కీయాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారాడు. ఆయ‌న వేసే స్టెప్పులు హాట్ టాపిక్‌గా మారాయి. ఇటీవ‌ల చంద్ర‌బాబుతో ములాఖ‌త్ అయిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత తాను టీడీపీతో పొత్తు పెట్టుకున్న‌ట్టు తెలియ‌జేశాడు. దీంతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్పుడు వైసీపీ నాయ‌కుల‌తో విమ‌ర్శ‌ల బారిన ప‌డుతున్నాడు. ఈ క్ర‌మంలో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌పై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్‌ కళ్యాణ్ జనసేన పార్టీని ఎందుకు పెట్టారన్నారు. ఏ రాజకీయ నాయకుడైనా పార్టీ పెట్టి అధికారంలోకి రావాలని చూస్తారన్నారు. కానీ పవన్ కళ్యాణ్‌ మాత్రం తను పార్టీ పెట్టింది అధికారంలోకి రావడానికి కాదన్న ఆయన.. టీడీపీని అధికారంలోకి తీసుకురావడానికే పవన్‌ కళ్యాణ్‌ జనసేన పార్టీని స్థాపించారని విమర్శించారు.

ఎన్నికల్లో గెలిచిన అనంతరం ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోతే పొత్తులు పెట్టుకుంటారన్న ఆయన.. వపన్‌ మాత్రం పార్టీ పెట్టిన సమయంలోనే టీడీపీతో పొత్తు పెట్టుకొని, చంద్రబాబును అధికారంలోకి తీసుకురావడానికి ప్యాకేజీ తీసుకున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాంటప్పుడు పవన్‌ కళ్యాణ్ పార్టీని ఏర్పాటు చేయడం ఏందుకని విమర్శించారు. పార్టీ స్థాపించిన పవన్‌ పొత్తులు పెట్టుకునే బదులు ఆ పార్టీని టీడీపీలో విలీనం చేస్తే మంచిదని హితువు పలికారు. మరోవైపు చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేసిన రామకృష్ణారెడ్డి.. చంద్రబాబు చరిత్ర మొత్తం వెన్నుపోటు చరిత్రే అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అధికారం కోసం సొంత మామను మోసం చేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నందమూరి కుటుంబ సభ్యులను సైతం మోసం చేస్తున్నారని విమర్శించారు.

MLA Alla Ramakrishna Reddy comments on pawan kalyan
MLA Alla Ramakrishna Reddy

టీడీపీ అధికారంలోకి వచ్చాక పవన్‌కు ఇస్తానన్న ప్యాకేజీ ఇవ్వకుండా పవన్‌ కళ్యాణ్‌ను సైతం మోసం చేస్తారన్నారు. పవన్‌ కళ్యాణ్‌ ఎన్నికల్లో పోటీచేయదలుచుకుంటే ఏ పార్టీతో పొత్తు లేకుండా ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆయన.. చంద్రబాబు లాంటి మోసపూరిత వ్యక్తితో పొత్తులు పెట్టుకొని పార్టీని దివాలా తీసే పరిస్ధితి తెచ్చుకోవద్దని సూచించారు. చంద్రబాబు, పవన్‌తో పాటు ఇతర పార్టీలతో కలిసి ఎన్ని కుట్రలు చేసినా రానున్న ఎన్నికల్లో అధికారంలోకి రాలేరన్నారు. రాష్ట్రంలో మరోసారి వైసీపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Share
Shreyan Ch

Recent Posts

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

3 hours ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

7 hours ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 day ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 days ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

4 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

4 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

4 days ago