Manchu Vishnu : ఇటీవల జరిగిన అలయ్ బలయ్ కార్యక్రమ వేదికపై అనూహ్య ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అలయ్ బలయ్ కార్యక్రమం జరుగుతున్న ప్రాంగణానికి చిరంజీవి రాగానే.. ఆయనతో, ఫొటోలు దిగేందుకు, సెల్ఫీలు తీసుకునేందుకు పలువురు పోటీపడ్డారు. అడిగిన వారందరికీ సెల్ఫీలు ఇస్తూ చిరంజీవి అక్కడే కాసేపు గడిపారు. అయితే, ఆ సమయంలో వేదికపై గరికపాటి.. ‘చిరంజీవి గారూ.. ఆ ఫొటో సెషన్ ఆపకపోతే, నేను ఇక్కడ నుంచి వెళ్లిపోతా’ అని అన్నారు.అప్పుడు వేదికపై ఉన్నవారు గరికపాటికి సర్థి చెప్పారు. కాసేపటికే చిరంజీవి కూడా వేదికపైకి రావడంతో సభ సాగింది.
చిరంజీవిని ఉద్దేశిస్తూ గరికపాటి చేసిన కామెంట్స్ తీవ్రమైన చర్చకు దారి తీశాయి. మెగా అభిమానులు గరికపాటి తీరుని పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. నాగబాబుతో పాటు పలువురు ప్రముఖులు కూడా దీనిపై స్పందించారు. తాజాగా ఈ ఇష్యూపై మంచు విష్ణు రియాక్ట్ అయ్యారు. తన జిన్నా సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న ఆయన.. చిరంజీవి- గరికపాటి వివాదంపై ఆసక్తికరంగా స్పందించారు. అక్కడ ఏం జరిగిందో నాకు కరెక్ట్ గా అయితే తెలియదు కానీ.. చిరంజీవి, ఆయన ఫ్యాన్స్ అదీ ఇదీ అంటూ గరికపాటి ఏదో మాట్లాడినట్లు ఉన్నారు.
చిరంజీవి గారు ఒక లెజెండ్. అలాంటి వ్యక్తి వచ్చినప్పుడు అభిమానులు ఫోటోలకు ఎగబడడం అనేది సహజంగా జరిగేదే. ఆ ఉత్సాహాన్ని కంట్రోల్ చేయడం ఎవరికీ సాధ్యం కాకపోవచ్చు. పెద్ద స్టార్స్ వస్తే ఇలాంటి సంఘటనలు కామన్ అని అన్నారు మంచు విష్ణు.అదే అలయ్ బలయ్ ఈవెంట్ లో చిరు మాట్లాడుతూ.. స్నేహానికి, ఓ చక్కని బంధానికి చిహ్నంగా జరుపుకునే ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ఎంతో సంతోషిస్తున్నా. ఇలా స్నేహానికి చిహ్నంగా జరుపుకునే ఈ కార్యక్రమం తెలంగాణ కల్చర్లో ఉండడం ఈ గడ్డ గొప్పతనం అని అన్నారు. ఇక మంచు విష్ణు తాను నటిస్తున్న జిన్నా మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో విష్ణు సరసన సన్నీలియోన్, పాయల్ రాజ్ పుత్ నటిస్తున్నారు. ఇషాన్ సూర్య దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…