Krishnamma OTT : ఒకప్పుడు థియేటర్స్లో రిలీజైన సినిమా ఓటీటీలోకి రావడానికి కనీసం 3 నెలలు అయిన సమయం పట్టేది. కాని ఇప్పుడు వారం తిరగకుండానే ఓటీటీలోకి వచ్చేస్తుంది. తాజాగా సత్యదేవ్ నటించిన చిత్రం ఏకంగా వారం రోజులకే ఓటీటీలోకి అడుగుపెట్టి ఆడియన్స్కి షాకిచ్చింది. హీరో సత్యదేవ్ రివెంజ్ డ్రామా ‘కృష్ణమ్మ’ గత శుక్రవారం (మే 10) థియేటర్లలో గ్రాండ్గా రిలీజ్ కాగా, ఈ మూవీకి పాజిటివ్ టాక్ కూడా వచ్చింది. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు కాని పెద్దగా ఆడియన్స్ థియేటర్స్కి రాలేదు. అయితే సరిగ్గా ఆక్యుపెన్సీ లేకపోవడంతో మూవీని ఓటీటీలోకి తీసుకొచ్చారు.
కృష్ణమ్మ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. నేడు 17నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. కేవలం తెలుగులోనే స్ట్రీమింగ్ అవుతుంది ఈ సినిమా .. తెలుగు సినిమాకు ఆడియోలో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో స్ట్రీమింగ్ అవుతుంది. సినిమాకి మంచి టాక్ వచ్చినా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లు రాబట్టలేకపోయింది కృష్ణమ్మ. ఈ మధ్య కాలంలో ఇంత తక్కువ సమయంలో ఓటీటీలో మరే తెలుగు సినిమా రాలేదని తెలుస్తోంది. ఇప్పుడు ఓటీటీలో కృష్ణమ్మ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది.
నిజానికి కృష్ణమ్మ సినిమాను సత్యదేవ్ కూడా గట్టిగానే ప్రమోట్ చేశాడు. రివ్యూల్లో కూడా సత్యదేవ్ నటనకి మంచి మర్కులు పడ్డాయి. కానీ ఆడియన్స్ మాత్రం థియేటర్లకి రాకుండా హ్యాండ్ ఇచ్చారు. ఐపీఎల్ సీజన్ కావడంతో ఈ మధ్య కాలంలో సినిమాల పరిస్థితి పెద్దగా బాలేదు. అందులోనూ ఎలక్షన్ హడావిడి కూడా నడుస్తుండటంతో పెద్ద సినిమాలు ఏవీ థియేటర్లలో అడుగుపెట్టలేదు. దీంతో చిన్న సినిమాలను ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు. నిమాకు ప్రజెంటర్గా కొరటాల శివ వ్యవహరించడంలో కృష్ణమ్మపై బజ్ బాగానే ఏర్పడింది. ప్రమోషన్స్లో సుకుమార్తో పాటు పలువురు అగ్ర దర్శకులు పాల్గొనడం, ట్రైలర్, టీజర్స్ ఆకట్టుకోవడంతో గత వారం రిలీజైన తెలుగు సినిమాల్లో కృష్ణమ్మపైనే ఎక్కువ అంచనాలు ఏర్పడ్డాయి.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…