Krishnam Raju : నటనకు చెరగని చిరునామా రెబల్ స్టార్ కృష్ణం రాజు అని చెప్పవచ్చు. కృష్ణం రాజు సొంతపేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. తెలుగు సినిమా కథానాయకుడిగా, నిర్మాతగా, రాజకీయవేత్తగా ఓ వెలుగు వెలిగిన కృష్ణంరాజు ఆదివారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆయన ప్రైవేటు ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. విషయం తెలియగానే అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు కన్నీటి పర్యంతం అయ్యారు. కృష్ణం రాజు మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు అని ఆయనకు పలువురు సంతాపం తెలియజేస్తున్నారు.
కృష్ణం రాజు 1940 జనవరి 20న మొగల్తూరులో ఉప్పలపాటి వీర వెంకట సత్యనారాయణ రాజు, లక్ష్మి దేవి దంపతులకు జన్మించారు. వీరిది ధనిక కుటుంబమే. ఆయనకు వారసత్వంగా వచ్చిన వంద ఎకరాల భూమి మొగల్తూరులో ఉంది. దాని నిర్వాహణ బంధువులే చూసుకుంటారట. మొగల్తూరులో ఒక భవనం కూడా ఉందట. ఇక చెన్నై, హైదరాబాద్ నగరాల్లో మొత్తం కృష్ణం రాజుకి నాలుగు ఖరీదైన ఇళ్లు ఉన్నాయి. ఇక ప్రస్తుతం ఆయన నివసిస్తున్న ఇంటి ఖరీదు రూ.18 కోట్ల వరకు ఉంటుందని అంచనా.
హైదరాబాద్ లో కృష్ణం రాజుకి ఒక ఫామ్ హౌస్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. గోపికృష్ణ అనే నిర్మాణ సంస్థని కూడా కృష్ణం రాజు స్థాపించారు. నటుడిగానే కాకుండా నిర్మాతగాను కృష్ణం రాజు బాగానే సంపాదించారు. కృష్ణం రాజు రూ.90 లక్షల విలువైన మెర్సిడిజ్ బెంజ్ కారు, రూ.40 లక్షల విలువైన టొయోటా ఫార్చునర్ కారు, రూ.90 లక్షల విలువైన వోల్వో ఎక్స్ సి లాంటి కార్లను ఉపయోగిస్తారు. ఇంటికి అతిథులు ఎవరైన వస్తే వారికి కడుపు నిండా భోజనం పెట్టడం కృష్ణం రాజుకి అలవాటు. దీనిని ప్రభాస్ కూడా కొనసాగిస్తున్నారు. కానీ కృష్ణం రాజు అకాల మరణంతో ప్రతి ఒక్కరూ కన్నీటి పర్యంతం అవుతున్నారు.
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…
గుంటూరు కారంతో చివరిగా పలకరించిన మహేష్ బాబు గత కొద్ది రోజులుగా రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలలో పాల్గొంటూ…