Krishnam Raju : తెలుగు తెరపై చెరగని ముద్ర వేసుకున్న నటుడు కృష్ణం రాజు. హీరోగా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా కృష్ణం రాజు నటించి మెప్పించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణం రాజు చికిత్స పొందుతూ కన్నుమూశారు. 83 ఏళ్ల కృష్ణంరాజు మరణవార్త విని టాలీవుడ్ ఒక్కసారిగా దిగ్బ్రాంతికి గురైంది. నటనతోనే కాదు, డైలాగ్ డెలివరీతో కూడా కృష్ణం రాజు ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నారు. మొదట్లో నెగెటివ్ పాత్రలతో ప్రేక్షకులకు దగ్గరైన కృష్ణంరాజు ఆ తరువాత హీరోగా మెరిశారు.
ఆదివారం తెల్లవారుజామున కృష్ణం రాజు కన్నుమూయగా, ఆయన మృతికి సంబంధించి వైద్యులు పలు విషయాలు వెల్లడించారు. రక్తప్రసరణ సరిగా లేకపోవడంతో గతేడాది కృష్ణంరాజు కాలుకు సర్జరీ జరిగిందని చెప్పారు. దీర్ఘకాలంగా మూత్రపిండాలు, ఊపిరితిత్తుల సమస్యలతో ఆయన బాధపడుతున్నట్టుగా తెలిపారు. ఆగస్టు 5వ తేదీన పోస్టు కోవిడ్ సమస్యలతో కృష్ణంరాజు ఏఐజీ ఆస్పత్రిలో చేరినట్టుగా వెల్లడించారు. మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా కారణంగా ఊపిరితిత్తుల్లో తీవ్ర న్యుమోనియా ఉన్నట్లు గుర్తించామని వైద్యులు పేర్కొన్నారు.
కిడ్నీ పనితీరు పూర్తిగా దెబ్బతినడంతో ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి కృష్ణంరాజుకు వెంటిలేటర్పై చికిత్స అందించినట్టుగా వైద్యులు స్పష్టం చేశారు. ఆదివారం తెల్లవారుజామున హార్ట్ స్ట్రోక్ రావడంతో ఆయన కన్నుమూసినట్టు తెలియజేశారు. కాగా కృష్ణం రాజు.. కృష్ణవేణి, భక్త కన్నప్ప, త్రిశూలం, బొబ్బిలి బ్రహ్మన్న, పల్నాటి పౌరుషం వంటి చిత్రాల్లో నటించి స్టార్ హీరోగా ఎదిగారు. కృష్ణం రాజు మరణవార్తతో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. సోమవారం ఉదయం కృష్ణం రాజు అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు తెలుస్తుంది.
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…
గుంటూరు కారంతో చివరిగా పలకరించిన మహేష్ బాబు గత కొద్ది రోజులుగా రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలలో పాల్గొంటూ…