Kidney Stones : కిడ్నీలో రాళ్ల సమస్య ప్రస్తుతం చాలా మందికి వస్తోంది. చిన్నా పెద్దా ఈ సమస్య బారిన పడుతున్నారు. దీని వల్ల పొట్టలో నొప్పిగా ఉంటుంది. మూత్ర విసర్జన తరచూ చేయాల్సి వస్తుంది. మూత్రం పోసిన తరువాత మంటగా కూడా ఉంటుంది. నొప్పిని తాళలేకపోతుంటారు. అయితే కిడ్నీ స్టోన్లు అనగానే చాలా మంది కంగారు పడుతుంటారు. కానీ వాటిని సహజసిద్ధంగానే కరిగించుకోవచ్చు. అందుకు కింద తెలిపిన చిట్కాలను పాటించాలి. ఇప్పుడు ఏం చేయాలో తెలుసుకుందాం.
రాత్రి పూట ఒక గుప్పెడు మెంతులను నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయాన్నే పరగడుపునే ఆ నీటిని తాగాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే కిడ్నీ స్టోన్లు కరిగిపోతాయి. చెంచాడు తులసి ఆకు రసంలో అంతే మోతాదులో తేనె కలిపి ప్రతి రోజూ ఉదయాన్నే పరగడుపునే సేవించాలి. దీంతో కిడ్నీలలోని రాళ్లు కరిగిపోతాయి. వేపాకులను కాల్చి బూడిద చేసి పూటకు ఒకటిన్నర గ్రాముల చొప్పున నీటిలో కలిపి రెండు పూటలా తాగుతుంటే రాళ్లు కరిగిపోతాయి.
కొత్తిమీర వేసి మరిగించిన నీటిని రెండు పూటలా తాగుతుండాలి. కిడ్నీలో రాళ్లు పోతాయి. ప్రొద్దు తిరుగుడు చెట్టు వేళ్ల పొడిని చెంచాడు మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ మజ్జిగలో కలిపి తాగాలి. అలాగే పెసరపప్పును కొద్దిగా తీసుకుని లీటరు మంచినీళ్లలో వేసి మరిగించాలి. తరువాత చల్లార్చాలి. అనంతరం దానిపై తేరిన కట్టును తాగాలి. ఇలా రోజూ చేస్తే రాళ్లు పడిపోతాయి. ఇలా పలు సహజసిద్ధమైన చిట్కాలతో కిడ్నీలలోని రాళ్లను తొలగించుకోవచ్చు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…