Kantara Question : రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన కన్నడ చిత్రం కాంతార. ఈ సినిమా చిన్నమూవీగా వచ్చి ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం 18కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా ఏకంగా రూ.450కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ని షేక్ చేస్తూ, ఫిల్మ్ మేకర్స్ ని సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. ఇది అనేక పురస్కారాలను అందుకుంది. కన్నడ చిత్ర పరిశ్రమని మరో మెట్టు ఎక్కించింది. అయితే కాంతార మూవీ తాజాగా మరో రికార్డ్ సృష్టించింది . కన్నడ ప్రభుత్వ ఎగ్జామ్స్ లో ఓ ప్రశ్న కాంతార చిత్రం నుంచి వచ్చింది. కర్నాటక మిల్క్ ఫెడరేషన్ ఎగ్జామ్ పేపర్లో ఈ సినిమా నుంచి ప్రశ్న వచ్చింది.
అదేంటంటే.. ఇటీవల విడుదలైన కాంతార చిత్రం దేని ఆధారంగా తెరకెక్కింది అని ప్రశ్నించారు. దీనికి నాలుగు ఆప్షన్లుగా జల్లికట్టు, భూత కోలా, యక్షగాన, దమ్మమి అనే ఆప్షన్లు ఇచ్చారు. క్వచ్ఛన్ పేపర్లోని ఈ ప్రశ్న క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది చూసిన హీరోయిన్ సప్తమి గౌడ ఈ పేపర్ని తన ఇన్స్టాగ్రామ్ ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. బెస్ట్ పార్ట్ ఆఫ్ ది క్వచ్ఛన్ పేపర్ అని పేర్కొంది.దీంతో ఆ క్లిప్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అంతేకాదు కన్నడ అభిమానులు కూడా ఈ విషయంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇక `కాంతార` విషయానికి వస్తే.. బలమైన కంటెంట్ ఉంటే భాషకు అతీతంగా సినిమాని ఆదరిస్తారని ఈ సినిమా ఎంతగానో నిరూపించింది. ఇందులో దర్శకుడు, నటుడు రిషబ్ శెట్టి హీరోగా నటించడంతోపాటు సినిమాకి దర్శకత్వం వహించారు. సప్తమి గౌడ హీరోయిన్గా నటించగా, `కేజీఎఫ్`ని నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ దీన్ని నిర్మించడం విశేషం. కన్నడ సాంప్రదాయ పండగ భూత కోల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. క్లైమాక్స్ సినిమాకి మెయిన్ హైలైట్గా నిలిచింది. అంతేకాక మ్యూజిక్ కూడా సినిమాకి ఆయువుపట్టుగా నిలిచింది.ఈ చిత్రం భారీ కలెక్షన్లతోపాటు ఐఎండీబీ టాప్ 10 అవార్డుని కూడా అందుకుంది. కాంతార చిత్రం ఓటీటీలో కూడా ప్రభంజనం సృష్టించింది. బుల్లితెరపై ఈ సినిమా ఎప్పుడు ప్రసారం అవుతుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…