Jagan And Bharati : వినూత్న పథకాలు ప్రవేశపెట్టి వాటిని అమలు చేస్తూ ఏపీ ప్రజల మనసులు దోచుకున్నారు వైఎస్ జగన్. ఏపీ ముఖ్యమంత్రిగా ఆయన ప్రజలకి సేవ చేస్తూ వస్తున్నారు. పాదయాత్ర ద్వారా జనాలకి చాలా దగ్గరైన జగన్ ముఖ్యమంత్రిగాను ప్రజల బాగోగుల కోసం ఎంతో కష్టపడుతున్నారు. ఈ క్రమంలో జగన్కి విపరీతమైన క్రేజ్ ఉంటుంది. రీసెంట్గా జగన్, ఆయన సతీమణి భారతి ఓ వివాహ వేడుకకి హాజరు కాగా, ఆ వివాహ వేడుకలో వీరిద్దరే సెంట్రాఫ్ అట్రాక్షన్గా మారారు. జగన్ని తమ కెమెరాలలో బంధించేందుకు పోటీపడ్డారు. ఇక భారతితో కూడా కొందరు మహిళలు ఫోటోలు తీసుకునేందుకు ఆసక్తి చూపారు. ప్రస్తుతం అయితే వారి క్రేజ్ కి సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, భారతీరెడ్డి దంపతులకు వివాహమై 26 ఏళ్లు అవుతుంది. ఆగస్ట్ 28న వారి వివాహ వార్షికోత్సవం కాగా, ఈ సెలబ్రేషన్స్ కోసం వారు విదేశాలకి వెళ్లబోతున్నారని సమాచారం. కడప జిల్లా పులివెందులలోని వైఎస్ఆర్ఆర్ లయోలా డిగ్రీ కాలేజీ గ్రౌండ్లో ఆగస్టు 28, 1996 ఉదయం 10:30 గంటలకు వైఎస్ జగన్-భారతి వివాహం ఘనంగా జరిగింది. ఇదే ముహూర్తానికి వివేకానంద రెడ్డి కుమార్తె సునీత వివాహం కూడా జరగడం విశేషం.
వైఎస్ జగన్ వివాహం నాటికి ఆయన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కడప ఎంపీగా ఉన్నారు. వైఎస్ భారతిది పులివెందులకు చెందిన స్వర్గీయ ప్రముఖ వైద్యుడు డాక్టర్ ఈసీ గంగిరెడ్డి కుమార్తె. 24 ఏళ్ల వయస్సుకే వివాహం చేసుకున్న జగన్మోహన్ రెడ్డికి ఇద్దరు కుమార్తెలు. గతేడాది 25వ వివాహ వార్షికోత్సవాన్ని వేడుకగా జరుపుకున్న ముఖ్యమంత్రి దంపతులు.. ఈ ఏడాది కూడా వారి వెడ్డింగ్ యానివర్సరీ చేసుకోనున్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలతో పాటు జగన్ అభిమానులు సోషల్ మీడియాలో పాత ఫొటోలను ఇప్పటి నుండే వైరల్ కూడా చేస్తున్నారు. ఇక మరి కొద్ది రోజులలో ఏపీ ఎలక్షన్స్ రానున్న నేపథ్యంలో జనగ్ కూడా పక్కా ప్రణాళికలు రచిస్తూ ముందుకు సాగుతున్నారు.
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…