Jabardasth Sowmya Rao : దాదాపు దశాబ్ద కాలం నుంచి తెలుగు బుల్లితెరపై టాప్ కామెడీ షో గా దూసుకుపోతున్న కార్యక్రమం జబర్దస్త్ .ఈ షో ప్రేక్షకులందరికీ అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ పంచుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే గత కొంతకాలం నుంచి జబర్దస్త్ కార్యక్రమంలో ఎవరు ఊహించని విధంగా అనేక మార్పులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. జబర్దస్త్ లో అనసూయ వెళ్ళిపోయిన తర్వాత కొత్త యాంకర్ సౌమ్యరావు వచ్చింది. చిన్నితెరపై ఆమె కనిపించే తీరు, సందర్భానుసార మాటలు ఆమెను పాపులర్ చేస్తున్నాయి. దీంతో క్రమంగా బుల్లితెరపై సౌమ్య ట్రెండ్ క్రియేట్ అవుతోంది.
సోషల్ మీడియాలో కూడా సౌమ్య రావు తన ఫాలోయింగ్ పెంచుకునేలా గేర్ వేస్తూ స్పెషల్ అట్రాక్షన్ అవుతోంది సౌమ్యరావు. రెగ్యులర్ గా గ్లామర్ ఫోటో షూట్లతో యూత్ మతిపోగొడుతోంది. అయితే సౌమ్యరావు ఇప్పుడు జబర్ధస్త్ నుండి తప్పుకుందనే వార్త నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది. అనసూయ ఏ కారణంతో జబర్థస్త్ ను వీడిందో.. సౌమ్య కూడా అదే కారణంతో జబర్థస్త్ నుంచి తప్పుకుంటుందట. జబర్దస్త్ లో బాడీ షేమింగ్ కామెంట్స్ హద్దులు మీరుతున్నాయని..అందుకే అనసూయ కూడా ఈ షో నుంచి తప్పుకుందనే టాక్ వచ్చింది.
ఇదే క్రమంలో కొత్తగా జబర్దస్త్ లోకి యాంకర్ సౌమ్య అడుగు పెట్టగా, మూడు , నాలుగు ఎపిసోడ్స్ బాగనే ఉంది. కాని ఆ తర్వాత సౌమ్య సైతం హైపర్ ఆది లాంటివాళ్ల డబల్ మీనింగ్ డైలాగ్స్ కి బాడీ షేమింగ్ కామెంట్స్ చేస్తూ ఆమెని ఇబ్బంది పెడుతున్నారట. దీంతో తాను కుదుర్చుకున్న అగ్రిమెంట్ని సైతం క్యాన్సిల్ చేసుకొని సౌమ్యరావు జబర్ధస్త్ కి గుడ్ బై చెప్పిందని, ఇప్పుడు మరో కొత్త యాంకర్ కోసం మల్లెమాల వెతుకులాట మొదలు పెట్టిందని ప్రచారం నడుస్తుంది.మరి ఇందులో ఎంత నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…