Jabardasth Mahesh : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాన్ ఇండియా స్టార్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన సెట్లో ఉంటే.. అందరికీ ఆరోజు కడుపు నిండిపోవాల్సిందే. బాహుబలి సినిమాలో నటించడమే కాదు.. ఆ మంచి మనసు ప్రభాస్లో ఉంది. పేరుకే రాజు కాకుండా.. నిజంగానే రాజు అని నిరూపించుకున్నాడు ప్రభాస్. అందరి కడుపు నింపాలని ఎప్పుడూ పరితపిస్తుంటాడు. ప్రభాస్ తన పెదనాన్న కృష్ణంరాజు పెద్దకర్మకు వచ్చిన అభిమానుల అందరి కడుపునింపి అందరిని ఆశ్చర్యపరిచాడు. కడుపు నిండా భోజనం పెట్టి పంపించాడు. అప్పట్లో ఈ వార్తలు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే.
ప్రభాస్ చాలా సింపుల్ గా ఉంటాడు. ప్రభాస్ కు చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. అతను తన ఇంటికి వచ్చిన గెస్టులను ఎలా చూసుకుంటారో అందరికీ తెలుసు. ఆయన భోజనానికి పిలిస్తే కనీసం 30 రకాల వంటలు ఉంటాయి. ప్రభాస్ ఆతిథ్యం మరిచిపోలేనిది. ప్రభాస్ డబ్బు మనిషి కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఒక రాజు ఎలా ఉంటాడో ప్రభాస్ ను చూస్తే తెలుస్తుంది’ అని ఒకానొక సందర్భంలో తమన్నా చెప్పుకొచ్చింది. అయితే జబర్ధస్త్ నటుడు మహేష్ తాజాగా ప్రభాస్తో జరిగిన కొన్ని సంఘటనలు గురించి చెప్పారు.
మారుతితో సినిమా గురించి మాట్లాడుతూ ‘మాట ఇచ్చాక నిలబెట్టుకోవడమే ప్రభాస్ గొప్పతనం’అని అన్నారు. మారుతి సినిమాలో ఆయన అన్ స్టాపబుల్ షోలో కనిపించినట్లుగా ఉంటారన్నారు. ఇక షూటింగ్ సమయంలో ఆయన తెప్పించిన ఫుడ్ గురించి చెప్పారు మహేష్. అందరూ చెబుతుంటే విన్నాను కానీ..తాను చూశానంటూ ఎగ్జైట్ అయ్యారు. ‘షూటింగ్ సమయంలో ..200, 300 మందికి ఫుడ్ తెప్పించారు. అందరూ కుమ్మేసాం. నేను మటన్ బాగా తిన్నాను. నాకు నచ్చింది మటన్ అని అనగానే మటన్ అన్నా అనగానే..మళ్లీ రేపొద్దున మహేష్కు మటన్ తెప్పించండి అన్నారు. ఆయనే ఇంటి నుండి వండించి, పంపించారు. అందరూ చెబుతుంటే విన్నాను కానీ..ఆ రోజు చూశాను. నెక్ట్ లెవల్ అంతే అంటూ జబర్ధస్త్ మహేష్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…