మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భాగంగా హైదరాబాద్ వేదికగా భారత్ , న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 349 పరుగులు చేసింది. యువ ఓపెనర్ శుబ్ మన్ గిల్ కేవలం 149 బంతుల్లోనే 208 పరుగులు చేసి కెరీర్ లో తొలి డబుల్ సెంచరీని అందుకున్నాడు. ఇందులో 19 ఫోర్లు, 9 సిక్సర్లు ఉండటం విశేషం. న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ బ్రేస్ వెల్ కూడా నిప్పుల చెరిగాడు. అయితే శుబ్ మన్ గిల్ సెంచరీ కంటే కూడా న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లేథమ్ చేసిన ఒక పని ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది.
భారత ఇన్నింగ్స్ సందర్భంగా హార్దిక్ పాండ్యా వికెట్ విషయంలో మోసానికి పాల్పడ్డ న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్కు ఇషాన్ కిషన్ తనదైన శైలిలో బుద్ది చెప్పాడు. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్న తరహాలో చేసిన ఈ పనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు ఇషాన్ కిషన్ చేసిన పనిని సమర్థిస్తుంటే మరికొందరు మాత్రం తప్పుబడుతున్నారు. దాంతో ఈ వ్వవహారం హాట్టాపిక్గా మారింది. కాగా, భారత ఇన్నింగ్స్లో థర్డ్ అంపైర్ తప్పిదానికి హార్దిక్ పాండ్యా బలయ్యాడు. డేరిల్ మిచెల్ వేసిన 40వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకోగా, ఈ ఓవర్ నాలుగో బంతి హార్దిక్ పాండ్యా బ్యాట్ను తాకకుండా కీపర్ టామ్ లాథమ్ చేతిలో పడింది.
అయితే బెయిల్స్ కిందపడటంతో న్యూజిలాండ్ ఆటగాళ్లు అప్పీల్ చేశారు. దాంతో ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్ సమీక్ష కోరగా.. పలు కోణాల్లో పరిశీలించి ఔటిచ్చాడు. బంతిని అందుకునే క్రమంలో టామ్ లాథమ్ గ్లోవ్స్ తాకి బెయిల్ కిందపడినట్లు రిప్లేలో స్పష్టంగా కనిపించింది. కానీ థర్డ్ అంపైర్ ఔటివ్వడం అందర్నీ విస్మయపరిచింది. ఇది మనసులో పెట్టుకున్న ఇషాన్ కిషన్.. టామ్ లాథమ్ తరహాలోనే కీపింగ్ గ్లోవ్స్తో బెయిల్స్ను పడేసి ఔట్ కోసం అప్పీల్ చేశాడు. కానీ రీప్లేలో ఇషాన్ గ్లోవ్స్ తాకినట్లు తేలడంతో అంపైర్ నాటౌటిచ్చాడు. కుల్దీప్ యాదవ్ వేసిన 16వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…