న్యూజిలాండ్తో జరిగిన తొలి వన్డేలో భారత్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అసలు ఆశలే లేని న్యూజిలాండ్ టీమ్ ను ఏకంగా 350 టార్గెట్ చేజ్ చేసే దిశగా తీసుకెళ్లాడు బ్రేస్వెల్ . అయితే చివరి ఓవర్లో చివరి వికెట్ గా వెనుదిరగడంతో ఇండియా 12 పరుగులతో గెలిచి ఊపిరి పీల్చుకుంది. బ్రేస్వెల్ 78 బంతుల్లోనే 140 రన్స్ చేశాడు. అతని తుఫాను ఇన్నింగ్స్ లో ఏకంగా 12 ఫోర్లు, 10 సిక్స్ లు ఉన్నాయి. 350 రన్స్ చేజింగ్ లో ఒక దశలో 131 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఓటమి తప్పదనుకున్న స్థితి నుంచి న్యూజిలాండ్ గెలవడం పక్కా అనుకునేలా చేశాడు బ్రేస్వెల్. సాంట్నర్ తో కలిసి ఏడో వికెట్ కు 162 రన్స్ జోడించి టీమిండియా వెన్నులో వణుకు పుట్టించాడు. చివరి విజయానికి 20 పరగులు అవసరం కాగా.. తొలి బంతికే సిక్స్ కొట్టాడు.
అయితే చివరి ఓవర్ వేసిన శార్దూల్.. రెండో బంతికి యార్కర్ తో బ్రేస్వెల్ ను ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేయడంతో ఇండియా ఊపిరి పీల్చుకుంది. మ్యాచ్ పూర్తి అయిన తర్వాత శార్ధూల్ మాట్లాడుతూ.. విరాట్ బాయ్ సలహా వలనే నేను యార్కర్ వేసానని శార్ధూల్ చెప్పుకొచ్చాడు. ఇక లోకల్ బాయ్ సిరాజ్ 4 వికెట్లతో న్యూజిలాండ్ ఓటమిలో కీలకపాత్ర పోషించాడు. ఇక కీలకమైన సమయంలో హార్దిక్ పాండ్యా కూడా పొదుపుగా బౌలింగ్ చేసి ఆకట్టుకున్నాడు. కుల్దీప్, శార్దూల్ చెరో రెండు వికెట్లు తీశారు. అంతకుముందు టీమిండియా ఓపెనర్ శుభ్మన్ గిల్ చెలరేగిపోయాడు. శ్రీలంకతో చివరి వన్డేలో సెంచరీ బాదిన అతడు.. ఇప్పుడు న్యూజిలాండ్ పై ఏకంగా డబుల్ సెంచరీ చేశాడు.
గిల్ కేవలం 145 బంతుల్లోనే ఈ మార్క్ అందుకున్నాడు. వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన ఐదో బ్యాటర్ గా నిలిచాడు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఓవైపు సహచరులంతా ఒక్కొక్కరుగా పెవిలియన్ కు చేరుతుంటే.. గిల్ మాత్రమే చివరి వరకూ క్రీజులో నిలిచి టీమ్ కు భారీ స్కోరు సాధించి పెట్టాడు. అయితే ఆఖర్లో కివీస్ విజయానికి 6 బంతుల్లో 20 పరుగులు చేయాల్సి ఉండగా, శార్దూల్ ఠాకూర్ విసిరిన తొలి బంతినే బ్రేస్వెల్ సిక్స్ బాదాడు. ఆ తర్వాత బంతి వైడ్ గా వెళ్లడంతో సమీకరణం 5 బంతుల్లో 13 పరుగులుగా మారింది. అయితే, శార్దూల్ ఠాకూర్ అద్భుతమైన బంతితో బ్రేస్వెల్ వీరోచిత ఇన్నింగ్స్ కు ముగింపు పలికాడు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…