IND Vs SA : తిరువనంతపురంలో జరిగిన మొదటి టీ20 మ్యాచ్లో సౌతాఫ్రికాపై భారత్ ఘన విజయం సాధించింది. భారత బౌలర్ల ధాటికి సౌతాఫ్రికా బ్యాట్స్మెన్ విలవిలలాడిపోయారు. ఈ క్రమంలోనే ఆ జట్టు స్వల్ప స్కోరును మాత్రమే చేయగలిగింది. దాన్ని భారత్ అలవోకగా సాధించింది. సౌతాఫ్రికాపై భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా.. సౌతాఫ్రికా బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలోనే సఫారీలు 20 ఓవర్లలో 8 వికెట్లకు 106 పరుగులు మాత్రమే చేశారు. ఆ జట్టు బ్యాట్స్మెన్లలో కేశవ్ మహరాజ్ (41 పరుగులు, 5 ఫోర్లు, 2 సిక్సర్లు), వాయ్నె పార్నెల్ (24 పరుగులు, 1 ఫోర్, 1 సిక్సర్) మినహా ఎవరూ చెప్పుకోదగిన స్కోరు చేయలేదు. కాగా భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ 3 వికెట్లు పడగొట్టగా.. దీపక్ చాహర్, హర్షల్ పటేల్లకు చెరో 2 వికెట్లు దక్కాయి. అక్షర్ పటేల్ 1 వికెట్ తీశాడు.
అనంతరం బ్యాటింగ్ చేసిన భారత్ నిదానంగా ఆచి తూచి ఆడింది. దీంతో 16.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. 2 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. భారత బ్యాట్స్మెన్లలో కేఎల్ రాహుల్, సూర్య కుమార్ యాదవ్లు రాణించారు. 56 బంతులు ఆడిన రాహుల్ 2 ఫోర్లు, 4 సిక్స్లతో 51 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. అలాగే మరో బ్యాట్స్మెన్ సూర్య కుమార్ యాదవ్ 33 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 50 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఇక సౌతాఫ్రికా బౌలర్లలో రబాడా, నోర్జె చెరొక వికెట్ తీశారు. ఈ విజయంతో భారత్ 3 టీ20ల సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ సిరీస్లో రెండో టీ20 అక్టోబర్ 2వ తేదీన రాత్రి 7 గంటలకు అస్సాంలోని గౌహతి స్టేడియంలో జరగనుంది.
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…