Green Gram : పెసలను సాధారణంగా చాలా మంది గుగ్గిళ్లుగా చేసుకుని తింటుంటారు. కొందరు ఉడకబెట్టి తింటుంటారు. కొందరు మొలకలుగా చేసుకుని.. ఇంకొందరు పెసరట్లుగా వేసుకుని తింటుంటారు. అయితే పెసలను చాలా తేలిగ్గా తీసుకుంటారు. కానీ వీటితో మనకు అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. పెసలను రోజూ తినాలే కానీ అనేక లాభాలను పొందవచ్చు. వీటిల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. కనుక జీర్ణ సమస్యలు అసలు ఉండవు. గ్యాస్, మలబద్దకం, అజీర్ణం తగ్గుతాయి. అలాగే పెసలను క్రమం తప్పకుండా రోజూ తినడం వల్ల శరీరంలోని కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్) తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ (హెచ్డీఎల్) పెరుగుతుంది. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్లు రాకుండా చూసుకోవచ్చు.
పెసలలో మన శరీరానికి కావల్సిన అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ప్రోటీన్లు, బి కాంప్లెక్స్ విటమిన్లు ఉంటాయి. కనుక పోషకాహార లోపంతో బాధపడుతున్నవారికి పెసలు సరైన ఆహారం అని చెప్పవచ్చు. వీటిని రోజూ తింటే పోషకాహార లోపం తగ్గుతుంది. అలాగే వీటిల్లో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. రోగాలు రాకుండా రక్షిస్తుంది. పెసలలో ఉండే పొటాషియం హైబీపీని తగ్గిస్తుంది. రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. వీటిల్లో మెగ్నిషియం కూడా ఎక్కువే. కనుక మానసిక ఒత్తిడి తగ్గి మనస్సు ప్రశాంతంగా మారుతుంది. దీంతో నిద్ర చక్కగా పడుతుంది. పడుకున్న వెంటనే నిద్రలోకి జారుకుంటారు. నిద్రలేమి తగ్గుతుంది.
ఇక పెసలను తినడం వల్ల కాల్షియం, ఐరన్ పుష్కలంగా లభిస్తాయి. దీని వల్ల ఎముకలను దృఢంగా మార్చుకోవచ్చు. రక్తహీనత తగ్గుతుంది. అలాగే వీటిల్లో ఉండే విటమిన్ ఎ కంటి చూపును మెరుగు పరుస్తుంది. కంటి సమస్యలను తగ్గిస్తుంది. పెసలలో ఉండే విటమిన్ ఇ జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. జుట్టు రాలడం తగ్గుతుంది. ఇలా పెసలతో మనం అనేక ప్రయోజనాలను పొందవచ్చు. అయితే వీటిని మొలకెత్తించి లేదా ఉడకబెట్టి తినవచ్చు. ఉదయం బ్రేక్ఫాస్ట్లో అయితే మొలకలను తింటే మేలు. అదే సాయంత్రం అయితే ఉడకబెట్టి తినాలి. దీంతో వీటి ద్వారా మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చు.
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…