Gautami : ఒకప్పటి అందాల తార నటి గౌతమి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. తెలుగు, తమిళ భాషలలో తన అందం, అభినయంతో ఎంతగానో ఆకట్టుకుంది. తమిళ సినిమాలు చేస్తూనే అపుడపుడు తన మాతృ భాష తెలుగు సినిమాల్లో నటించి ఇక్కడ ప్రేక్షకులను కూడా అలరించింది. విశాఖలో గీతమ్ యూనివర్సిటీలో చదువుకునేటపుడే తన కసిన్ నిర్మించే ‘దయామయుడు’ చిత్రంతో నటిగా పరిచయమైన గౌతమి అనంతరం రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన ‘గాంధీనగర్ రెండో వీధి’ సినిమాలో కథానాయికగా నటించింది. అదే యేడాది కన్నడ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.
గౌతమి తెలుగులో కొన్ని సెలెక్టివ్ సినిమాలు మాత్రమే చేసింది. ‘బజారు రౌడీ’, ’తోడళ్లుల్లు’,‘ఆగష్టు 15 రాత్రి’, ప్రచండ భారతం’, ‘కృష్ణ గారి అబ్బాయి, ‘అన్నా తమ్ముడు’, ‘అగ్గిరాముడు’, బామ్మ మాట బంగారు బాట’, చైతన్య, ‘డియర్ బ్రదర్’ వంటి తెలుగు సినిమాల్లో నటించి అలరించింది. 80వ దశకం చివరలో తెలుగు సినిమాకి పరిచయమైన గౌతమి, గ్లామరస్ కథానాయికగా మంచి మార్కులను కొట్టేసింది. అప్పటి స్టార్ హీరోలు అయిన వెంకటేశ్ .. నాగార్జున వంటి స్టార్స్ జోడీగా తెరపై సందడి చేశారు. అయితే చిరంజీవి, బాలకృష్ణ వంటి హీరోలతో ఒక్క మూవీ చేయలేదు.
తాజా ఇంటర్వ్యూలో గౌతమి మాట్లాడుతూ .. “చిరంజీవిగారు .. బాలకృష్ణగారి సినిమాల నుంచి కూడా నాకు అవకాశాలు వచ్చాయి. అయితే నా డేట్స్ కుదరకపోవడం వలన, ఆ ఇద్దరితో చేయలేకపోయాను. సినిమాల దిశగా మా పేరెంట్స్ నన్ను ప్రోత్సహించారు. కానీ నేను చెప్పకుండానే మా అమ్మాయి ఫిల్మ్ మేకింగ్ వైపు వెళ్లింది అని అన్నారు. ఇక 80వ దశకానికి సంబంధించిన హీరోయిన్స్ టీమ్ ప్రతి ఏడాది కలుస్తుంటారు. ఆ కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానిస్తూనే ఉంటారు. అయితే నిజానికి వాళ్లంతా నా సీనియర్స్ కాబట్టి వాళ్లంటే నాకు ఎంతో గౌరవం ఉంది. అలాంటివారితో నేను చనువుగా మసలుకోలేను. అందువల్లనే నేను వెళ్లడం లేదు అని చెప్పుకొచ్చింది గౌతమి.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…