ప్రస్తుత తరుణంలో చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తున్న సమస్యల్లో అసిడిటీ కూడా ఒకటి. దీని వల్ల కడుపులో మంటగా ఉంటుంది. ఏమీ సహించదు. అసిడిటీ అనేక కారణాల వస్తుంది. కారణాలు ఏమున్నప్పటికీ ఇది వస్తే ఒక పట్టాన తగ్గదు. అయితే దీన్ని తగ్గించుకునేందుకు చాలా మంది ఇంగ్లిష్ మెడిసిన్ను వాడుతుంటారు. అలా కాకుండా కింద తెలిపిన సహజ సిద్ధమైన చిట్కాలను పాటిస్తే.. అసిడిటీని సులభంగా తగ్గించుకోవచ్చు. ఇక ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
అసిడిటీ సమస్య ఉన్న వారు ఒక టీస్పూన్ వాము తీసుకుని అందులో కొద్దిగా ఉప్పు వేసి బాగా నమిలి తినాలి. అనంతరం ఒక గ్లాస్ నీటిని తాగాలి. ఇలా చేయడం వల్ల అసిడిటీ సమస్య తగ్గుతుంది. లేదా రాత్రి పూట ఒక గ్లాస్ నీటిలో ఒక టీస్పూన్ వామును నానబెట్టి మరుసటి రోజు ఉదయాన్నే ఆ నీటిని తాగి ఆ వామును తినాలి. దీంతో కూడా ఆ సమస్య తగ్గుతుంది. భోజనం చేసిన వెంటనే సోంపు గింజలను తిన్నా లేదా వాటితో తయారు చేసిన టీని తాగినా అసిడిటీ సమస్య ఉండదు. పాలు, పెరుగు సహజసిద్ధమైన అంటాసిడ్ల మాదిరిగా పనిచేస్తాయి. అందువల్ల వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే అసిడిటీ సమస్య బాధించదు.
ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక టీస్పూన్ తేనెను కలిపి భోజనం చేసిన వెంటనే తాగాలి. ఇలా చేస్తే అసిడిటీ సమస్య తగ్గుతుంది. ఒక గ్లాస్ మజ్జిగలో చిటికెడు ధనియాల పొడిని కలుపుకుని తాగితే అసిడిటీ సమస్య తగ్గుతుంది. అరటి పండ్లు కూడా సహజసిద్ధమైన అంటాసిడ్ల లాగా పనిచేస్తాయి. భోజనం అనంతరం ఒక అరటి పండును తింటే అసిడిటీ సమస్య ఉండదు. దీంతోపాటు జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయి. గ్యాస్, మలబద్దకం, అజీర్ణం నుంచి ఉపశమనం లభిస్తుంది.
అసిడిటీ సమస్య తగ్గేవరకు తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాలను తీసుకోవాలి. అలాగే కారం, మసాలాలను తగ్గించాలి. ఈ చిట్కాలను పాటించడం వల్ల అసిడిటీ సమస్య నుంచి సులభంగా బయట పడవచ్చు.
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…
గుంటూరు కారంతో చివరిగా పలకరించిన మహేష్ బాబు గత కొద్ది రోజులుగా రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలలో పాల్గొంటూ…