Farzi Series : ఇటీవలి కాలంలో ఓటీటీ వెబ్ సిరీస్లకి మంచి డిమాండ్ ఏర్పడుతుంది. ఓటీటీలు వచ్చాక వారం, రెండు వారాల్లోనే సినిమాలు, పలు వెబ్ సిరీస్లు అరచేతిలోకి వచ్చేస్తున్నాయి. ప్రేక్షకులు కూడా ఓటీటీలకు బాగా అలవాటు పడిపోయారు. ప్రతీ వారం కొత్త సినిమా ఏది రిలీజవుతుందా అని తెగ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు థియేటర్ లో రెండు గంటల సినిమా చూడలేకపోయిన ప్రేక్షకులు కంటెంట్ బాగుంటే ఐదారు గంటలైనా అలవోకగా చూసేస్తున్నారు. స్టార్ నటీనటులు కూడా వెబ్ సిరీస్లో నటించాలని తీవ్ర ఆసక్తి చూపుతున్నారు. ఎందుకంటే వెబ్ సిరీస్లో ముఖ్యమైన అన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతాయి.
‘ది ఫ్యామిలీమ్యాన్’ను తెరకెక్కించిన దర్శక ద్వయం రాజ్&డీకే రూపొందించిన మరో సిరీస్ ‘ఫర్జీ’. షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ వెబ్ సిరీస్.. ప్రస్తుతం ఓటీటీలో దూసుకుపోతోంది. ఇటీవల రిలీజైన ఈ సినిమా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇండియన్ ఓటీటీ వేదికల్లో అత్యధిక మంది వీక్షించిన వెబ్ సిరీస్గా ఫర్జీ రికార్డు నెలకొల్పింది. అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ను ఇప్పటివరకు 37 మిలియన్ల మంది వీక్షించినట్టు సమాచారం.. దీని తర్వాత స్థానాల్లో అజయ్ దేవగణ్ రుద్ర (32.7 మిలియన్లు), పంచాయత్ (29.6 మిలియన్లు) వ్యూవర్స్తో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.
నకిలీ కరెన్సీ నోట్ల బ్యాక్ డ్రాప్ లో రూపోందిన ఈ వెబ్ సిరీస్ లో ఎలాంటి పేయింటింగ్ నైనా అచ్చుగుద్దినట్లు గీయగలిగే గొప్ప కళాకారుడుగా షాహిద్ కపూర్ నటించారు. విజయ్ సేతు పతి నటించడంతో.. తమిళంలో కూడా ఈ వెబ్ మూవీ దూసుకుపోయింది. ఎలాంటి పెయింటింగ్ నైనా అచ్చుగుద్దినట్లు గీయగలిగే గొప్ప కళాకారుడు సన్నీ (షాహిద్ కపూర్).. తన తాత నడుపుతున్న పత్రిక అప్పుల పాలవడంతో దొంగ నోట్లను ముద్రించాలని ఆలోచన చేస్తాడు. మరోవైపు దొంగనోట్ల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వ ఆఫీసర్ (విజయ్ సేతుపతి) కూడా ఆ ప్రయత్రాలలో ఉంటాడు. దొంగనోట్లను సన్నీ ఎలా ముద్రించాడు. అతడికి ఎదురైన సవాళ్లేంటి అనే నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది.
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…