సైలెంట్గా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన చిత్రం కాంతార. ఈ చిత్రం ఇంటా బయటా కూడా భారీ లాభాలు అందిపుచ్చుకుంటూ అందరి ప్రశంసలు అందుకుంటుంది.కన్నడలో చిన్న సినిమాగా మొదలైన కాంతారా ప్రభంజనం ఇపుడు తెలుగుతో పాటు ఉత్తారాది ప్రేక్షకులను కూడా ఫిదా చేస్తోంది. అక్కడ ఈ సినిమాకు సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. తాజాగా ఈ సినిమాను కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ వీక్షించి అద్భుతం అంటూ కితాబు ఇచ్చారు. కాంతారా మూవీని నిర్మల సీతారామన్ బెంగళూరులోని మల్టీప్లెక్స్లో వీక్షించారు. ఈ సినిమాను చూసిన నిర్మల సీతారామన్ దర్శకుడు కమ్ హీరో రిషబ్ శెట్టిని ఫోన్లో ప్రత్యేకంగా అభినందించారు.
రిషబ్ శెట్టి ఈ సినిమాకి దర్శకత్వం వహించడమే కాక ఇందులో ప్రధాన పాత్ర తానే పోషించారు. అయితే ముందుకు ఈ సినిమాకి పునీత్ రాజ్ కుమార్ని అనుకున్నాడట రిషబ్.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మొదట ఈ సినిమా స్టోరీని తాను పునీత్ రాజ్ కుమార్ గారికి వినిపించానని అయితే అప్పట్లో ఆయన వరుసగా ఇతర సినిమాల షెడ్యూల్ తో బిజీగా ఉండటంతో చేయలేకపోయాను. అయితే ఆ మట్టి వాసన బాగా పండాలంటే.. హీరోగా నువ్వే నటించాలి అని పునీత్ సలహా ఇచ్చాడట . ఈ సినిమా టేకింగ్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావద్దని కూడా ఆయన అన్నారని రిషబ్ తెలియజేశాడు.
పునీత్ కనుక ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చి ఉంటే కథ మరోలా ఉండేది. ‘కాంతార’ కన్నడలో సెప్టెంబర్ 30వ తేదీన విడుదలైంది. తొలి రోజునే అక్కడ ఆ సినిమా రికార్డుస్థాయి వసూళ్లను చూడటంతో, 15 రోజుల తరువాత తెలుగుతో పాటు ఇతర భాషల్లోను విడుదల చేశారు. ‘కేజీఎఫ్’ సినిమాను నిర్మించిన బ్యానర్ కావడంతో, ఇతర భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి బడా సంస్థలు పోటీ పడ్డాయి. ఏ భాషలో విడుదల చేస్తే ఆ భాషలో ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇంతవరకూ ఈ సినిమా 300 కోట్లకి పైగా వసూళ్లను సాధించినట్టుగా, తాజాగా ఈ సినిమా టీమ్ అధికారిక పోస్టర్ ను వదిలింది.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…