Sr NTR And ANR : టాలీవుడ్ ఇండస్ట్రీకి రెండు కళ్ళ లాంటి వారు విశ్వవిఖ్యాత నట నట సార్వభౌమ నటరత్న డాక్టర్ నందమూరి తారకరామారావు మరియు నటసామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు. హీరోలకు కొరతగా ఉన్న రోజుల్లో ప్రవేశించి తమ ప్రతిభతో అత్యున్నత స్థాయికి చేరుకొని తెలుగు జాతి గర్వించదగ్గ చిత్రాలను చేయడమే కాక ఎంతో మంది మనసులు గెలుచుకున్నారు.తెలుగు చిత్రపరిశ్రమలో హీరోలకు కొరతగా ఉన్న రోజుల్లో ప్రవేశించి, తమ ప్రతిభతో అత్యున్నత స్థాయికి చేరుకుని తెలుగు జాతి గర్వించదగ్గ చిత్రాలను అందించారు ఈ ఇద్దరు హీరోలు అందించారు. వీరిద్దిరిలో కొన్ని సారూప్యాలు, మరికొన్ని వైరుధ్యాలున్నాయి.
వీరు హీరోలు కాకముందు స్టేజి మీద స్త్రీ పాత్రలు పోషించారు. అక్కినేని హరిశ్చంద్రలో చంద్రమతి వేషం వేస్తే, 1940లో కాలేజీలో ఇంటర్ చదివే రోజుల్లో రాచమల్లు దౌత్యం నాటకం లో నాగమ్మ వేషం వేశారు ఎన్టీఆర్. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు క్రమశిక్షణ కూడా నేర్పారు. ఆరోగ్య విషయాల తో సహా అన్నింటా క్రమశిక్షణతో మెలిగారు. తెలుగు చిత్ర పరిశ్రమకు గుర్తింపు, గౌరవం, హోదా, డబ్బు తెచ్చిపెట్టిన ఘనత వీరిద్దరికి దక్కుతుంది.. 1932లో మాట నేర్పిన తెలుగు సినిమా 9 ఏళ్లు పూర్తి చేసుకున్న సమయంలో నాగేశ్వరరావు చిత్ర రంగంలోకి ప్రవేశించారు. ఆయన వచ్చిన ఏడేళ్ల అనంతరం రామారావు సినీ రంగ ప్రవేశం చేశారు. అక్కినేని నాగేశ్వరరావు మొదటి చిత్రం ధర్మపత్ని. ఎన్టీఆర్ మొదటి చిత్రం మన దేశం. వీరిద్దరు తమ మొదటి చిత్రాలలో గుర్తింపు పొందని పాత్రల్లో నటించారు.
స్వర్ణయుగం తొలి దశాబ్ద కాలంలో విడుదలైన చిత్రాల సంఖ్య లో సగభాగం ఈ మహానటులు నటించిన చిత్రాలు ఉండడం చెప్పుకోవలసిన విషయం. స్టార్డమ్ ఎంజాయ్ చేస్తున్న వీరిద్దరూ ఎలాంటి భేషజాలకు పోకుండా 14 సినిమాల్లో కలిసి నటించారు. వాటిలో పౌరాణిక జానపద చారిత్రక సాంఘిక చిత్రాలు కూడా ఉన్నాయి. ప్రపంచ సినీ చరిత్రలో ఏ ఇద్దరు అగ్ర నటులు ఇన్ని సినిమాల్లో ఇన్ని జానర్ లలో కలిసి నటించలేదనే చెప్పాలి.. ఇది ఒక రికార్డు అనే చెప్పాలి. ఇంతటి అనుబంధం కలిగిన వీరిద్దరి మధ్య అన్నపూర్ణ స్టూడియోస్ కి సంబంధించిన ఏడెకరాల స్థలం విషయంలో మళ్లీ మనస్పర్ధలు ఏర్పడి దాదాపు ఏడేళ్లు మాట్లాడుకోలేదు. . తెలుగు సినిమాకి స్టార్డమ్ నేర్పిన ఈ మహానటులిద్దరూ తమ మధ్య అభిప్రాయభేదాలు ఉన్నప్పటికీ ఏనాడు బహిరంగంగా ఒకరినొకరు నిందించుకోలేదు.
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…