CM YS Jagan : దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనే ఏపీ ప్రభుత్వ శకటం అందరి దృష్టిని ఆకర్షించింది.75వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా జాతీయ జెండాలు వాడవాడల రెపరెపలాడాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీ నగరంలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలకి ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఇతర కేంద్ర మంత్రులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఇక ఈ వేడుక పరేడ్ లో ప్రదర్శించిన శకటాలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఢిల్లీలోని కర్తవ్యపథ్ లో ఆంధ్రప్రదేశ్ శకటాన్ని ప్రదర్శించారు. ఏపీ విద్యా శకటానికి దేశం మొత్తం ఫిదా అయ్యింది.
ఏపీ లో గత నాలుగున్నరేళ్లగా విద్యకు అత్యధిక ప్రాధాన్య ఇవ్వడమే గాక, ఖరీదైన ఇంటర్నేషనల్ బాకలారియెట్ వంటి సిలబస్ ను ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయాలని సంకల్పించడం మనకు తెలిసిందే ఈ కాలంలో రాష్ట్రంలో విద్యారంగం సమూలంగా మారింది. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం చదువులు ప్రతి పల్లెకు చేరువయ్యాయి. ఇలా పేద పిల్లలకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను అందిచడమే లక్ష్యంగా పెట్టుకున్న ఏపీ ప్రభుత్వం.. ఆ సంస్కరణలకు అద్దం పట్టేలా రిపబ్లిక్ డే దినోత్సవం వేడుకల్లో విద్యా శకటాన్ని రూపొందించారు.
పాఠశాలల విద్యను మార్చడం- విద్యార్థులను ప్రపంచ వ్యాప్తంగా పోటీపడేలా చేయడం” అనే ఇతివృత్తంతో ఏపీ శకటాన్ని రూపొందించారు. రాష్ట్ర ప్రభుత్వ విద్యారంగంలో విప్లవాత్మకమైన సంస్కరణలు, వినూత్న పథకాలతో ప్రవేశపెట్టి కార్పొరేట్ స్కూల్స్ తో పోటీగా సర్కార్ బడులను అప్ గ్రేడ్ చేసింది. ఏపీ విద్యాకు సంబంధించిన 55 సెకన్ల నిడివిగ థీమ్ సాంగ్ తో ఈ శకటాన్ని ఢిల్లీ పరేడ్ లో ప్రదర్శించారు. ఇక విద్యార్థులతో నృత్యం చేయిస్తూ, విద్యా విలువను తెలియజేస్తూ..ఏపీ శకటం ముందుకు సాగింది. ఏపీ విద్యా శకటాన్ని చూసి దేశం మొత్తం ఫిదా అయింది. విదేశీయులు అయితే ఏకంగా క్లాప్స్ కూడా కొట్టారు. ప్రస్తుతం ఏపీ విద్యా శకటానికి చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనితో పాటు అయోధ్య రాముడు, చంద్రయాన్-3 శకటాలు అందర్నీ ఆకర్షించాయి.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…