YS Sharmila : ఏపీ ప్రజలకు ప్రధాని మోడీ అన్యాయం చేశారని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని మోడీ హామీ ఇచ్చారని..పదేళ్లు కాదు 15 ఏళ్లు ప్రత్యేక హోదా కావాలని చంద్రబాబు అడిగారని గుర్తు చేశారు. ఏపీ ప్రత్యేక హోదాను తేవడంలో చంద్రబాబు, జగన్ విఫలమయ్యారన్నారు షర్మిల. జగన్ మూడు రాజధానులని గందరగోళంచేశారని షర్మిల ఆరోపించారు. ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ సమావేశంలో పాల్గొన్నారు ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైనికులుగా కాకుండా ఒక్కో సైన్యంలాగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
వైసీపీ పార్టీని సొంత భుజాన వేసుకొని 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశానన్న షర్మిల ఇప్పుడు ఆ పార్టీ నుంచి దాడులను ఎదుర్కొంటున్నానన్నారు. వైఎస్ బిడ్డగా పుట్టింటికి వచ్చి కాంగ్రెస్ పార్టీ కోసం రాష్ట్రంలో రాజకీయం చేస్తున్నానని అన్నారు. ఇంకా ఎలాంటి త్యాగానికైనా, పోరాటానికైనా రెడీ అని అన్నారు. సీపీఎస్ అమలు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెడతామన్న షర్మిల ఇదే తిరుపతిలో 2014లో మోడీ 10 సంవత్సరాల ప్రత్యేక హోదా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. రామమందిరం కట్టిన నరేంద్ర మోడీ మరి ఇక్కడ దేవస్థానం ముందు ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. కోటి అనే వ్యక్తి హోదా కోసం తిరుపతిలో ఆత్మాహత్య చేసుకున్నారని షర్మిల తెలియజేశారు. మోడీ, చంద్రబాబుల గుంపు అలీబాబా అరడజను దొంగల గుంపుగా మారిందన్నారు.
ప్రజలకిచ్చిన ప్రతి మాట తప్పిన జగన్ ఏం జవాబు చెబుతారని ప్రశ్నించారు. వైఎస్సార్, జగనన్న పాలనకు ఆకాశం, పాతాళానికి ఉన్న తేడా ఉందని ఆరోపించారు. ‘ వైసీపీ, జగనన్న కోసం ఎంతో కష్టపడ్డ. కనీసం కృతజ్ఞత లేకుండా వ్యక్తిగత జీవితంపై దాడి చేస్తున్నారని పేర్కొన్నారు. నా పుట్టింటికి వచ్చి రాజకీయం చేస్తున్నా. ఎంతటి త్యాగానికైనా పోరాటానికైనా సిద్ధమేనని ప్రకటించారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…