Chiranjeevi In Navy : తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. కొన్ని దశాబ్ధాలుగా వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్నారు చిరు. ఇటీవల గాడ్ ఫాదర్ సినిమాతో తెలుగు సినీ ప్రేమికులని అలరించిన చిరంజీవి ఇప్పుడు వాల్తేరు వీరయ్య చిత్రంతో పలకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే కరోనా సమయం నుండి చిరంజీవి సోషల్ మీడియా పోస్ట్లతో కూడా సినీ ప్రేమికులని ఎంతగానో అలరిస్తూ వస్తున్నాడు. ఆదివారం నేవీ డే సందర్భంగా సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర ఫొటో పంచుకున్నారు చిరంజీవి. అది కాలేజ్ రోజుల నాటి ఫోటో కాగా, అందులో ఆయన నేవీ క్యాడెట్ యూనిఫాంలో ఉన్నారు.
గోవా ఎయిర్ పోర్టులో గతవారం తనను కొందరు నేవీ ఆఫీసర్లు కలిశారని వెల్లడించిన చిరంజీవి, తనకు పాతరోజులు గుర్తుకువచ్చాయని తెలిపారు. తాను కాలేజీలో చదువుకునే రోజుల్లో ఎన్ సీసీలో నావల్ క్యాడెట్ గా ఉన్నానని వివరించారు. కాగా, తనకు క్రమశిక్షణ అలవడిందంటే అందుకు కారణం ఎన్ సీసీ అని చిరంజీవి గతంలోనూ చెప్పారు. ఎన్ సీసీలో ఉన్నప్పుడు 1976 రిపబ్లిక్ డే సందర్భంగా ఏపీ తరఫున రాజభవన్ లో మార్చ్ పాస్ట్ లో పాల్గొన్నానని వెల్లడించారు. ఇటీవల వైఎన్ఎమ్ కాలేజీ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్న చిరంజీవి ఈ సంగతులు పంచుకున్నారు.
ఇక ఈ మధ్యే గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకల్లో మెగాస్టార్ను ‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్’ అవార్డుతో సత్కరించారు. ఆ కార్యక్రమంలో మాట్లాడిన చిరంజీవి.. ‘కొన్ని గుర్తింపులు ప్రత్యేకమైనవి. ఈ అవార్డు కూడా అలాంటిదే. నేను మధ్యతరగతి కుటుంబంలో పుట్టాను. నాకు లభించిన కీర్తి, పేరు, చరిష్మా, అభిమానుల అమూల్యమైన ప్రేమ ఆప్యాయత, ప్రతిదానికీ నేను చిత్ర పరిశ్రమకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. మా తల్లిదండ్రులకు కొణిదెల శివశంకర వర ప్రసాద్గా పుట్టినా మళ్లీ చిరంజీవిగా సినీ పరిశ్రమలో పుట్టాను అని అన్నారు. అన్ని రంగాలలో కరప్షన్ ఉంటుంది కాని,సినీ రంగంలో ఉండదు అని జీవితాంతం నటనను కొనసాగిస్తానని చిరంజీవి ఎమోషనల్గా చెప్పుకొచ్చారు.
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…