Geetha Krishna : చిరంజీవిగా ప్రసిద్ధి చెందిన కొణిదెల శివశంకర వర ప్రసాద్ కష్టంతో ఎదిగిన హీరో కాదు, ఇష్టంతో ఎదిగిన హీరో. చిరు అంటేనే ప్రతిభకు నిలువెత్తు నిదర్శనం, హీరో అవ్వాలని ఆశ పడే అతి సాధారణ కుర్రాళ్లకు నిజమైన ఆదర్శం. అన్నిటికీ మించి ప్రతి అవకాశంలోనూ ప్రతిభను కనబరచాలని ఎంతో కష్టపడుతూ వచ్చిన చిరు ఇప్పటికీ తెలుగులో మెగాస్టార్ గా రారాజుగా వెలిగిపోతున్నారు. కెరీర్ మొదట్లో చిరుకి హీరోగా అసలు గుర్తింపే రాలేదు. అయినా చిరు నిరుత్సాహ పడలేదు. విలన్ పాత్రల్లో కూడా నటించి మెప్పించాడు. చివరకు తనలోని ప్రతిభనే నమ్ముకొని హీరోగా సక్సెస్ అయిన అసలు సిసలు హీరో అనిపించుకున్నాడు.
సంక్రాంతికి చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య చిత్రం విడుదల కాగా, ఈ మూవీకి పోటీగా బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ విడుదల అవుతుంది. ఒక్కరోజు తేడాతో ఈ రెండు సినిమాలు విడుదల కానుండగా, అభిమానులు ఇప్పటి నుండే చర్చలు మొదలు పెట్టారు. గత రికార్డులు చూస్తూ బాలయ్య సినిమానే హిట్ కొడుతుందని కొందరు చెబుతుండగా, మెగాస్టార్ సినిమా అప్డేట్స్ చూశాక వాల్తేరు వీరయ్య హిట్ కొట్టడం గ్యారెంటీ అని కొందరు చెబుతున్నారు. . ఈ నేపథ్యంలో సీనియర్ దర్శకుడు గీతాకృష్ణ తన యూట్యూబ్ చానెల్లో ఆస్తికర కామెంట్స్ చేసారు. ఆయన చేసిన కామెంట్స్ బాలకృష్ణ అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తున్నాయి.
గీతాకృష్ణ తన యూట్యూబ్ చానెల్ ద్వారా తన అభిప్రాయాలను, విశ్లేషణలను ఎప్పటికప్పుడు ప్రేక్షకులతో పంచుకుంటున్నారు. అయితే, తాజాగా ఆయన ఒక వీడియో అప్లోడ్ చేయగా, ఈ వీడియోలో చిరు, బాలయ్య ఇద్దరిలో ఎవరు గొప్ప అనే ప్రశ్నకు సమాధానం చెప్పారు. ఇద్దరు సినిమాలో ఒకేసారి విడుదల అవుతుండటంతో ఇద్దరిలో ఎవరు గొప్ప అని అడుగుతున్నారని.. అసలు ఇది ప్రశ్నే కాదు అని ఆయన అన్నారు. చిరంజీవి ఇప్పటికే తనేంటో నిరూపించుకున్న నటుడు. మట్టిలో నుంచి పుట్టిన మాణిక్యం. ఎన్టీ రామారావు పేరు చెప్పుకొని వచ్చినోడు బాలకృష్ణ. చిరంజీవి స్థాయికి బాలకృష్ణ ఎప్పటికీ చేరుకోలేడు. బాలకృష్ణకు కొంతకాలం నడుస్తుంది. అతని సినిమాలకు థియేటర్లు కూడా ఇవ్వలేదని వాడెవడో ప్రొడ్యూసర్ ఆత్మహత్య కూడా చేసుకోబోయాడు’’ అని గీతాకృష్ణ వ్యాఖ్యానించారు. ఆహా వాళ్లు బాలయ్య వలన తమకు ఏదో మేలు జరుగుతుందని ఆయనని పిలిచారని, అదృష్టం బాగుండి అది వర్కవుట్ అయిందని గీతా కృష్ణ చెప్పారు.
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…