Chandra Babu : ఏపీలో స్కిల్ స్కాంలో తాజాగా హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో 52 రోజుల తర్వాత రాజమండ్రి జైలు నుంచి విడుదలైన చంద్రబాబు ప్రస్తుతం తన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునురీసెంట్గా జనసేనాని పవన్ కళ్యాణ్ కలిశారు. జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు ఇంటికి వెళ్లి ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాజకీయ అంశాలపై వీరిద్దరూ చర్చించారు. ఇందులో పలు అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. చంద్రబాబు పవన్ భేటీలో టీడీపీ-జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో పై ప్రధానంగా చర్చించారు.
త్వరలోనే ఉమ్మడిగా పది అంశాలతో మ్యానిఫెస్టో విడుదల చేసే అంశంపై మాట్లాడుకున్నారు. త్వరలో జనసేన టీడీపీ ఉమ్మడి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. రెండు పార్టీల మధ్య మరింత ఎక్కువగా సమన్వయం ఉండేలా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇవాళ్టి భేటీలో చంద్రబాబు కేసులపైనా పవన్ అడిగి తెలుసుకున్నారు. అయితే చంద్రబాబు తమపై పెట్టిన కేసులు గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. చేతకాక మమ్మల్ని ఇలా వేధిస్తున్నాడని అన్నారు. నాపైన లోకేష్పైన కేసులు పెడుతున్నాడు. పరిపాలన చేత కాక ఆయన చేసే పనులన్నింటిని ప్రజలు గమనిస్తున్నారంటూ చంద్రబాబు అన్నారు. రజనీకాంత్పై ఆయన ఏవేవో మాట్లాడారు. ఆయన గురించి రజనీకాంత్ ఏమైన అన్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేశ్ని A14గా పేర్కొంటూ ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో ఫైల్ చేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో లోకేశ్ కు CRPC సెక్షన్ 41A కింద సీఐడీ నోటీసులు జారీ చేసింది. అక్టోబర్ 4న విచారణకు రావాల్సిందిగా సీఐడీ నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులో హెరిటేజ్ తీర్మానాలు, అకౌంట్స్ పుస్తకాలు తీసుకురావాలని లోకేష్ను సీఐడి ఆదేశించింది. సీఐడీ ఆదేశించిన నిబంధనలపై లోకేశ్ హైకోర్టులో సవాల్ చేశారు. దీంతో స్పందించిన ధర్మాసనం వాదనలు జరిగిన అనంతరం అకౌంట్స్ బుక్స్ కోసం లోకేశ్ ను ఒత్తిడి చేయవద్దని సీఐడీకి హైకోర్టు ఆదేశించింది. దీంతో హైకోర్టు ఇచ్చిన నిబంధనల ప్రకారం లోకేశ్ ను సిట్ అధికారులు న్యాయవాది సమక్షంలోనే విచారించారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…