Team India : ప్రపంచ కప్ 2023లో భారత జైత్రయాత్ర కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే మంచి విజయాలతో దూసుకుపోతున్న తరుణంలో భారత్ కి బిగ్ షాక్ తగిలింది. చీలమండ గాయం నుంచి త్వరగా కోలుకొని నాకౌట్ మ్యాచ్లకైనా అందుబాటులోకి వస్తాడనుకున్న స్టార్ ఆల్రౌండర్ హార్ధిక్ పాండ్యా టోర్నీ నుంచి పూర్తిగా నిష్క్రమించాడు. గాయం కారణంగా వరల్డ్ కప్ను నుంచి పూర్తిగా దూరమైనట్టు ఐసీసీ ప్రకటించింది. చీలమండ గాయం నుంచి పాండ్యా ఇంకా కోలుకోలేదని, ప్రపంచ కప్లో మిగిలిన మ్యాచ్లకు దూరమవుతున్నట్టు వెల్లడించింది. హార్దిక్ స్థానంలో యువ ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ జట్టుతో చేరనున్నాడు. అయితే గాయపడిన ఆల్రౌండర్ స్థానంలో.. మరో ఆల్రౌండర్ను తీసుకుకుండా ఫాస్ట్బౌలర్ను ఎందుకు తీసుకున్నారనే ప్రశ్నలు సగటు క్రికెట్ ఫ్యాన్స్ మెదళ్లను తొలుస్తున్నాయి.
ఇప్పటికే జట్టులో మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ లాంటి ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. శార్దూల్ ఠాకూర్ లాంటి ఫాస్ట్ బౌలర్ ఆల్రౌండర్ కూడా జట్టుతో ఉన్నాడు. హార్దిక్ పాండ్యా గైర్హాజరీలో ఇండియా ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతోంది. దీంతో శార్దూల్ ఠాకూర్ సైతం బెంచ్కే పరిమితం కావాల్సిన పరిస్థితి. ఇలాంటి తరుణంలో మరో ఫాస్ట్ బౌలర్ అవసరమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. హార్ధిక్ పాండ్యా లాంటి ఆల్రౌండర్ స్థానంలో ఆల్రౌండర్ అయిన అక్షర్ పటేల్ను తీసుకోవచ్చు కదా అని కొంతమంది ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ప్రపంచకప్ కోసం మొదట ఎంపిక చేసిన 15 మందిలో అక్షర్ పటేల్ కూడా ఉన్నాడు. కానీ ఆసియా కప్లో అక్షర్ పటేల్ గాయపడటంతో వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ జట్టుతో చేరాడు.
మెగాటోర్నీలో స్పిన్నర్స్ కన్నా ఫాస్ట్ బౌలర్స్ ఎక్కువ పర్ఫార్మ్ చేస్తున్ఆరు. ఇప్పటి వరకూ ఫాస్ట్ బౌలర్లే ఎక్కువ వికెట్లు పడగొడుతూ వచ్చారు. టీమిండియా విషయానికి వస్తే బుమ్రా 15, షమీ 14 వికెట్లు పడగొట్టారు. ఇదే సమయంలో పిచ్లు సైతం ఫాస్ట్ బౌలర్లకే కాస్త అనుకూలంగా ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అక్షర్ పటేల్ వైపు కాకుండా ప్రసిద్ధ్ కృష్ణ వైపు బీసీసీఐ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. హార్దిక్ పాండ్యా స్థానంలో జట్టులోకి ఎక్స్ట్రా పేసర్ను తీసుకుంటే ఉపయోగంగా ఉంటుందని టీమ్ మేనేజ్మెంట్ భావించినట్లు తెలుస్తోంది. బుమ్రా, షమీ, సిరాజ్లలో ఎవరికైనా ఇబ్బంది తలెత్తినా.. మరో ఫాస్ట్ బౌలర్ అందుబాటులో ఉంటాడని కూడా టీమ్ మేనేజ్మెంట్ ఇలా ప్లాన్ చేసిందని అర్ధమైతుంది . కాగా పూణె వేదికగా బంగ్లాదేశ్పై మ్యాచ్లో బౌలింగ్ చేస్తూ హార్ధిక్ పాండ్యా గాయపడ్డాడు. ఎడమ చీలమండకు గాయమైంది, ఓవర్ ముగించకుండానే పాండ్యా బయటకు వెళ్లాడు. ఆ తర్వాత తిరిగి మైదానంలోకి రాలేదు. అయితే పాండ్యా ఎప్పటికి కోలుకుంటాడనే విషయంపై ఎలాంటి సమాచారం లేదు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…