Boya Naveena : ఇప్పుడిప్పుడే అన్ని ఫలితాలు వస్తున్నాయి. రీసెంట్గా ఇంటర్ ఫలితాలు విడుదల కాగా టెన్త్ ఫలితాలు కూడా విడుదల చేసేందుకు ప్రణాళికలు రచించారు. అయితే ఆంధ్రప్రదేశ్లో సోమవారం విడుదల చేసిన పదో తరగతి ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. ఇందులో పలువురు విద్యార్థుల జీవితాలు పలువురికి స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ఇంటి పరిస్థితి బాగా లేకున్నా అత్యధిక మార్కులు సాధించి శభాష్ అనిపించుకుంటున్నారు. ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో కూలి పనులకు వెళ్తూ పదోతరగతి చదివింది. వారంలో మూడు రోజులు కూలికి.. మూడు రోజులు స్కూల్ కి వెళ్తూ చదువుకుని టెన్త్లో 509 మార్కులు సాధించి ఆ బాలిక అందరికి ఆదర్శంగా నిలుస్తుంది.
చదువుకు పేదరికం ఎలాంటి అడ్డంకి కాదని నిరూపించింది ఓ బాలిక. కూలి పనులు చేస్తూ పట్టుదలతో చదివి టెన్త్ లో 600 మార్కులకు 509 మార్కులు సాధించి అందరిచేత ప్రశంసలు అందుకుంటోంది. ఆ విద్యార్థిని మరెవరో కాదు కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం బంటనహాలు గ్రామానికి చెందిన బోయ నవీన. బోయ ఆంజనేయులు, వన్నూరమ్మల కుమార్తె కాగా, వీరిది పేద కుటుంబం. కూలి పనులు చేస్తే పూట గడవని పరిస్థితి. తండ్రి వ్యవసాయ కూలీ. తల్లి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. కుటుంబ పరిస్థితిని గమనించిన నవీన అండగా ఉండేందుకు కూలి పనులకి సైతం వెళ్లేది. అయితే ఆమె వారంలో మూడు రోజులు కూలి పనులకు వెళ్తూ.. మూడు రోజులే పాఠశాలకు వెళ్లేది.
చిప్పగిరి ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఈ బాలికకు చదువుపై ఉన్న శ్రద్ధను చూసి ఉపాధ్యాయులు ఆమెని ఎంతగానో ప్రోత్సహించారు. ఆమె చదువుకునేందుకు కావాల్సిన సహాయం అందించారు. ఈ క్రమంలో నవీన పదో తరగతిలో కష్టపడి చదివి పదో తరగతిలో ఫలితాల్లో 509 మార్కులు సాధించింది. మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కెల్లా అత్యధిక మార్కులు సాధించి అందరి మన్ననలను అందుకుంది. ఇక ఇదిలా ఉంటే విజయవాడలోని గోవింద రాజుల ఈనాం ట్రస్ట్ మున్సిపల్ పాఠశాల పదో తరగతి విద్యార్థిని గాడెల్లి సువర్షిత 594 మార్కులు సాధించి అందరి ప్రశంసలు అందుకుంది. తండ్రి నాగరెడ్డిబాబు ఆటో డ్రైవర్ కాగా, తల్లి బేబి సరోజని గృహిణి. వారికి ముగ్గురు కుమార్తెలు. పటమటకు చెందిన నాగిరెడ్డి తన ముగ్గురు కుమార్తెలను మగ పిల్లలకంటే ధీటుగా పెంచారు. ఆటో నడుపుకుంటూ వచ్చే అరకొర ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. అయితే పదో తరగతి ఫలితాల్లో పెద్ద కుమార్తె సువర్షిత 594 మార్కులు సాధించడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…