Harshita : ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ 22న పదో తరగతి ఫలితాలు విడుదల కాగా, ఈ ఫలితాల్లో మట్టిలో మాణిక్యాలు అసాధారణ ప్రతిభ కనబరిచారు. టెన్త్ పరీక్ష ఫలితాల్లో రికార్డు స్థాయి మార్కులు తెచ్చుకుని అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. వారి పరిస్థితి తెలుసుకున్న ప్రతి ఒక్కరు అవాక్కవుతున్నారు..ఉమ్మడి కర్నూలు జిల్లా రుద్రవరం మండలం బీరవోలు ప్రాంతానికి చెందిన హర్షిత పదో తరగతి పరీక్షలలో 594 మార్కులు సాధించి అందరిని ఆశ్చర్యపరచింది. హర్షిత తండ్రి రైతు కాగా ఈమెకు మంచి మార్కులు రావడంతో గ్రామస్తుల ఆనందం అంతా ఇంతా కాదు. ఆమెని ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు.
హర్షితకు మంచి మార్కులు తెచ్చుకోవడంతో ఉన్నత చదువులకు ప్రభుత్వం నుంచి కూడా కొంతమేర సహాయం అందిస్తే బాగుంటుందని ఊరి జనాలు ముచ్చటించుకుంటున్నారు. హర్షిత తన టాలెంట్ తో ఎంతో కష్టపడి ఈ స్థాయికి ఎదిగారు.ఈ సారి ఏపీ పరీక్ష ఫలితాలలో ఎంతో మంది ఆణిముత్యాలు వెలుగులోకి వచ్చారు. ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన వెంకట నాగసాయి మనస్వీకి కూడా మంచి మార్కులు వచ్చాయి. ఒక్క హిందీలో తప్ప మిగిలిన అయిదు సబ్జెక్టుల్లో 100కు వంద మార్కులు సాధించింది. నూజివీడులోని ఓ ప్రైవేటు పాఠశాలలో మనస్వీ చదివింది.
తల్లిదండ్రులు ఆకుల నాగ వరప్రసాద్, నాగ శైలజ ఇద్దరూ ఉపాధ్యాయులే కావడంతో టీచర్ల బోధనతోపాటు వారి గైడెన్స్ సైతం ఎంతగానో ఉపయోగపడిందని తెలిపింది. ఐఐటీలో చదవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు మనస్వీ పేర్కొంది. ఇక మరికొన్ని గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి ఫలితాలు రిలీజ్ కానుండగా పాస్ పర్సెంటేజ్ ఎంత ఉంటుందో చూడాల్సి ఉంది.తల్లీదండ్రులు ప్రోత్సహిస్తే విద్యార్థులు పరీక్షల ఫలితాలలో అద్భుతాలు చేస్తారని చాలామంది విద్యార్థులు ప్రూవ్ చేస్తున్నారు. తెలంగాణ టెన్త్ ఫలితాలలో కూడా పేదింటి విద్యార్ధులు సత్తా చూపించడం ఖాయం అని అంటున్నారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…