Bhanu Sri Mehra : టాలీవుడ్ టాప్ హీరోలలో అల్లు అర్జున్ ఒకరు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన అల్లు అర్జున్ తన క్రేజ్ అంతకంత పెంచుకుంటూ పోతున్నాడు. అల్లు అర్జున్ పుష్ప తర్వాత ప్రస్తుతం పుష్ప2ను చేస్తోన్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ వస్తోన్న ఈచిత్రం ప్రస్తుతం షూటింగ్ను జరపుకుంటోంది. ఎక్కడా తగ్గకుండా సుకుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. పుష్ప ది రూల్ మూవీ అన్ని హక్కుల కోసం 900 కోట్ల రూపాయల ఆఫర్ వచ్చిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇక పుష్ప ది రూల్ సినిమా 250 కోట్లతో తెరకెక్కనుందని తెలుస్తోంది. ఈ సినిమాతో బన్నీ క్రేజ్ పీక్స్ కి వెళ్లడం ఖాయం అంటున్నారు.
ఇటీవల బన్నీ తెగ వార్తలలో నిలుస్తూ ఉన్నాడు. తాజాగా ఓ హీరోయిన్ విషయంలో హాట్ టాపిక్ అయ్యాడు. ఆ హీరోయిన్ భానుశ్రీ మెహ్రా. అల్లు అర్జున్తో వరుడు సినిమాలో ఆడిపాడిన ఈ భామ .. ఆ సినిమాతోనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమా అంతా ఆడకపోవడం వల్ల.. ఆ తర్వాత ఆమెకు పెద్దగాఅయితే చాన్సులు రాలేదు. కామియో, గెస్ట్ అప్పీయరెన్స్ పాత్రల్లో కనిపించినా.. అవి పెద్దగా హెల్ప్ అవ్వలేదు. కొంత కాలంగా ఈ ముద్దుగుమ్మ యూట్యూబ్లో సందడి చేస్తుంది. అయితే బన్నీ గురించి ఊహించని కామెంట్స్ చేసింది. బన్నీ తనను ట్విట్టర్లో బ్లాక్ చేశాడంటూ చెప్పుకొచ్చింది.
‘వరుడు’ తర్వాత ఇప్పటికీ తనకు మంచి అవకాశాలు రావడం లేదని తెలిపిన భానుశ్రీ.. ఎంతటి కష్టసమయంలోనైనా హాస్యాన్ని వెతుక్కోవడం తాను నేర్చుకున్నట్లు రాసుకొచ్చింది. అందుకు ఉదాహారణగా బన్నీ తనను ట్విట్టర్లో బ్లాక్ చేసినట్లు తెలిపింది. ఆ తర్వాత కాసేపటికీ గ్రేట్ న్యూస్, అల్లు అర్జున్ తనను అన్బ్లాక్ చేశాడంటూ మరో పోస్ట్ పెట్టింది ఆమె. దీంతో ఫ్యాన్స్ గందరగోళంలో పడిపోయారు. అయితే భానుశ్రీ యూట్యూబ్ ప్రమోషన్స్లో భాగంగా లింక్స్ ని సెలబ్రిటీల ట్విట్టర్లో పదే పదే షేర్ చేస్తుండడం వలన అలా చేసి ఉంటాడని అనుకుంటున్నారు. అయితే నా కేరీర్ సెట్ బ్యాక్ చేసుకోవడం కోసం అతన్ని బ్లేమ్ చేయడం లేదు. నా కష్టాల్లో నవ్వుతూ ముందుకు సాగిపోవడమే నేర్చుకుంటున్నాను. మున్ముందు మరింత మంచి కోసం వేచి ఉండండి. అలాగే అల్లు అర్జున్ కు ధన్యవాదాలు అని తెలిపింది వరుడు భామ.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…